మెయన్ ఫీచర్

కాంగ్రెస్ కర్మఫలం అనుభవించక తప్పదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అవినీతి, బంధుప్రీతి, పక్షపాతం,ఆశ్రీత పక్షపాతం-ఘనత వహించిన కాం గ్రెస్ పార్టీ ఇలాంటి దుర్వ్యవస్థలకు మా త్రమే కారణమని ఇంతకాలం అనుకుంటూ వచ్చాం. కానీ వాస్తవాలు మరింత వ్యాకులత కలిగించేవిగా ఉన్నాయి. కాంగ్రెస్ నేతృత్వంలోని యుపిఎ ప్రభుత్వం- తన పదవీకాలాన్నంతా న్యాయవ్యవస్థను దుర్వినియోగం చేయడం, దర్యాప్తు సంస్థల్ని కాపలా కుక్కలుగా వాడుకోవడంతోనే సరిపోయింది. తమ రాజకీయ గురువుల అజెండాను అమలు చేయడంలో భాగంగా ఈ దర్యాప్తు సంస్థలు జాతినీ, కోర్టుల్నీ తప్పుదారి పట్టించడంలో తీరిక లేకుండా గడిపాయి.
ఇటీవల వెలుగులోకి వచ్చిన ఇష్రాత్ జహాన్ ఎన్‌కౌంటర్ కేసు, మాలెగావ్ పేలుళ్లు, సంఝౌతా పేలుళ్ల కేసుల్లో వాస్తవాలు- కాంగ్రెస్ పార్టీని మరింత భ్రష్టు పట్టించేవిగా ఉన్నాయి. ఇష్రాత్ జహాన్ కాలేజీలో చదువుకునే ఓ అమాయక విద్యార్థిని అనీ, ఆమెను ఎన్‌కౌంటర్ పేరిట మట్టుబెట్టారని నిరూపించేందుకు ఇంతకాలం దర్యాప్తు సంస్థలు ఆడిన నాటకాలు బట్టబయలు కావడంతో కాంగ్రెస్ పరిస్థితి మరింత దిగజారింది. దీంతో మాజీ హోం మంత్రి మొదలుకుని కాంగ్రెస్‌లోని నేతలంతా ‘ఇష్రాత్ జహాన్ లష్కరే తోయిబా కార్యకర్తా లేక అమాయకురాలా’ అనే ప్రశ్నకు సమాధానం ఇవ్వకుండా, నకిలీ ఎన్‌కౌంటర్‌పైనే తమ పోరాటమంతా అని మాట మారుస్తున్నారు. వారి బాధంతా ఉగ్రవాదం గురించి కాదు...దాని సంగతి మరోసారి చూసుకోవచ్చు. తమ రాజకీయ ప్రత్యర్థుల్ని ఎలా ఇరికించాలా అన్నదానిపైనే. చిదంబరం ప్రకటననే చూడండి. ఇష్రాత్ జహాన్‌తోపాటు మరణించిన మిగతా ముగ్గురికీ కూడా ఆయన క్లీన్ చిట్ ఇచ్చేందుకే మొగ్గు చూపారు. ‘ఆనాటి నకిలీ ఎన్‌కౌంటర్‌లో నలుగురు చనిపోయారు. దానిపైనే మా పోరాటమంతా’ అన్నారాయన. ఆ ముగ్గురూ కూడా లష్కరే తొయ్యబాకు చెందిన ఉగ్రవాదులేనని తేలింది. కానీ చిదంబరం వాదన ప్రకారం వాళ్లు సాధారణ పౌరులే. ఉగ్రవాదులు కారన్నమాట.
మరోవిషయం. తాను అఫిడవిట్‌పై సంతకం చేయలేదని, కేవలం అండర్ సక్రెటరీ చేశారని చిదంబరం చెబుతున్నారు. నిజమే. నోట్ ఫైల్‌పై ఎవరు సంతకం చేశారన్నది సమస్యలో కీలకాంశమే! అఫిడవిట్‌పై తాను సంతకం చేయలేదంటూ చిదంబరం ఇతరులను పక్కదోవ పట్టించడానికి యత్నిస్తున్నారు. అఫిడవిట్‌పై ఆయన సంతకం చేశారని ఎవరూ అనడం లేదు. కేవలం అఫిడవిట్‌లోని డ్రాఫ్ట్‌కు ఆయన ఆమోదం తెలిపారు. అందువల్ల ఇప్పుడు దానిపై సంతకం ఎవరు చేశారన్నది కాదు ప్రశ్న. ఎవరు ఆమోదించారన్నదే అసలు సమస్య. ఇక్కడ సమస్యను పక్కదోవ పట్టించడానికి యత్నించిన చిదంబరం బొక్కబోర్ల పడ్డారు.
ఈవిధంగా సిగ్గుమాలిన తనంతో కూడిన కాంగ్రెస్ వ్యవహారశైలిని చూసి ఎవరు గట్టిగా నవ్వుకుంటారు? పాకిస్తాన్, లష్కరే తొయ్యబా! భారత్‌కు చెందిన గ్రాండ్ ఓల్డ్ పార్టీ, కేవలం తన రాజకీయ ప్రత్యర్థులను కాటువేయడంకోసం, ఉగ్రవాదులను అమాయకులుగా చిత్రీకరించడానికి కూడా వెనుకాడటం లేదు. ఆవిధంగా దేశ భద్రతపై తీవ్రస్థాయిలో రాజీపడుతున్నదనడంలో ఎంతమాత్రం సందేహం లేదు. సంఝౌతా ఎక్స్‌ప్రెస్ కేసులో కూడా సరీగ్గా ఇదే జరిగింది. ఈ పేలుడు సంఘటనలో లష్కరే తొయ్యబా పాత్ర స్పష్టంగా కనిపిస్తున్నప్పటికీ, భాజపాను దెబ్బకొట్టడం కోసం, మెజారిటీ వర్గానికి చెందిన కొందరిని కూడా ఈ కేసులో ఇరికించింది. ఉగ్రవాద చర్యలపై కేవలం ముస్లిం యువకులను మాత్రమే కాకుండా, హిందువులను కూడా ఈ కేసులో అరెస్ట్ చేశామని తెలపడం ద్వారా తమ ఓటు బ్యాంకును (ముస్లింలను) సంతుష్టి పరచడానికి యత్నించింది. ఈవిధంగా తానాడుతున్న రాజకీయ క్రీడలో భాగంగా లష్కరే ఉగ్రవాదులను, వదిలెయ్యడానికి కూడా కాంగ్రెస్ సిద్ధమైంది. అక్కడికి ఆ సంస్థేదో సుఫీ సన్యాసులకు చెందినదైనట్టు! ఇక్కడ కూడా, జాతి ప్రయోజనాలకంటే, పార్టీ ప్రయోజనాలకే పెద్దపీట వేయడం జరిగింది.
మాలెగావ్, అజ్మీర్ షరీఫ్,సమ్‌ఝౌతా ఎక్స్‌ప్రెస్ పేలుళ్లకు సంబంధించి వెలువడుతున్న సాక్ష్యాలు, గత యుపిఎ ప్రభుత్వంపై మాత్రమే కాదు, కొన్ని నిఘా సంస్థల పీకలకు చుట్టుకుంటున్నాయి. గత ప్రభుత్వం తన రాజకీయ ప్రత్యర్థులను ఇబ్బందుపాలు చేయడం కోసం, వారిని వివిధ కేసుల్లో ఇరికించడం ద్వారా ఎప్పటికప్పుడు ఒక దాని తర్వాత మరొకటి చొప్పున నిఘా సంస్థలను ప్రయోగిస్తూ పరిస్థితిని తమకు అనుకూలంగా మార్చుకోవడానికి యత్నించింది.
అసలే పీకల్లోతు కష్టాలకు తోడు, వివిఐపి హెలికాప్టర్ల కొనుగోలు కేసుకు సంబంధించి ఇటాలియన్ కోర్టు ఇచ్చిన తీర్పు కాంగ్రెస్‌ను మరింత ఇరుకున పడేసింది. ఐదుగురు రాజకీయ వేత్తలకు ఒక బ్యూరోక్రాట్‌కు లంచాలు అందాయని కోర్టు నిర్ధారించింది. ఈ తీర్పులో కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ పేరు ప్రముఖంగా వినిపించింది. పార్టీ నాయకత్వాన్ని పార్టీ వెనకేసుకు రావడంలో తప్పు లేకపోవచ్చు. కానీ ప్రభుత్వ నిర్ణయాలనే ప్రభావితం చేసే అత్యంత పలుకుబడి ఉన్న నాయకురాలన్న సంగతి ఇక్కడ గుర్తుంచుకోవాలి. మరి ఇప్పటి వరకు మనకు చెబుతూ వచ్చిందేమిటి? 10-జనపథ్‌లో ఉండే కాంగ్రెస్ అధినేత్రి కుటుంబీకులెవరూ ప్రభుత్వ నిర్ణయాల్లోకల్పించుకోరని! మరి ఇటీవల ఇటలీ నుంచి వెల్లడయిన విషయాలు చూస్తుంటే సోనియా కుటుంబం గురించి ఇప్పటివరకు మనకు చెబుతూ వచ్చిందంతా బూటకమని స్పష్టమవుతోంది. ఇక పార్టీ ప్రతినిధులు తమ విపరీత వాదనలతో ముందుకు వచ్చారు. ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీలు దేశం కోసం త్యాగాలు చేశారంటూ ఉదాహరణలు చెప్పడం మొదలుపెట్టారు. అయితే వారి త్యాగాలకు, ఇప్పటి అవినీతికి సంబంధమేంటి? మరో వాదన ఎంటంటే, ఈ హెలికాప్టర్ల ఒప్పందాన్ని యుపిఎ ప్రభుత్వం రద్దు చేసిందని, ఆ సంస్థను బ్లాక్ లిస్టులో పెట్టిందని, కంపెనీకి చెల్లించిన మొత్తాన్ని తిరిగి వసూలు చేసిందని. అన్నీ బాగానే ఉన్నాయి. కానీ ఇదంతా జరిగిందెప్పుడు? ప్రజల్లో, మీడియాలో గగ్గోలు పుట్టిన తర్వాత!
ఛాపర్ కొనుగోలు వ్యవహారంలో మధ్యవర్తి మైఖేల్‌ను దక్షిణాదికి చెందిన ఒక ఇంగ్లీషు దినపత్రిక దుబాయ్‌లో ఇం టర్వ్యూ చేసింది. ఇందులో అతను చేసిన ఆరోపణ ఏంటంటే..్భరత, ఇటలీ ప్రధానులు సమావేశమైనప్పుడు ఒక ఒప్పందం కుదిరింది. ఇందులో భాగంగా 3‘‘సింగోరా గాంధీ’’ని ఇరుకున పెట్టే డాక్యుమెట్లను భారత్‌కు ఇటలీ ప్రభుత్వం అందజేస్తుంది. అందుకు ప్రతిగా తన నిర్బంధంలో ఉన్న ఇటలీ మారినర్లను భారత్ విడిచిపెడుతుంది. ఇక్కడ ఆసక్తి కలిగించే అంశమేమంటే ఇద్దరు మారినర్లలో ఒకరిని సెప్టెంబర్ 30 వరకు ఇటలీలో ఉండేందుకు సుప్రీంకోర్టు సోమవారం అనుమతించింది. నిజానికి ఈ కేసును సుప్రీంకోర్టు నేరుగా డీల్ చేస్తున్నందువల్ల, ఇందులో ప్రభుత్వ ప్రమేయం ఏమీ ఉండదు. ప్రభుత్వం చేయగలిగింది కూడా ఏమీ లేదు.
ఛాపర్ల కొనుగోలు వ్యవహారంలో లం చం తీసుకున్న వారి బండారం బయటపడాలి. అదే అసలు సమస్య. ఎందుకంటే లంచం ఇచ్చినవారిని ఇటలీ కోర్టు ఇప్పటికే శిక్షించింది. దాని పరిణామాలు భారత రాజకీయాలపై ఏవిధంగా ఉంటాయన్న దాంతో అక్కడి కోర్టుకు సంబంధం లేదు. అందువల్ల అసలు సమస్యను పక్కదోవ పట్టించడంకోసం కాంగ్రెస్, దక్షిణాది ఇంగ్లీషు దినపత్రిక చేసిన ఇంటర్వ్యూను ముందుకు తీసుకొని రావడంలో ఆశ్చర్యపడాల్సిందేమీ లేదు. ఇంటర్వూ ఇచ్చిన మధ్యవర్తి మిగిలిన నేరస్తుల మాదిరిగానే, కోర్టు గుచ్చిగుచ్చి ప్రశ్నించినప్పుడు తనపైనే అందరి దృష్టి కేంద్రీకృతమై ఉన్న నేపథ్యంలో, దీన్నుంచి తప్పుకోవడానికి కచ్చితంగా పెద్ద వాళ్ల పేర్లను వెల్లడించడు. వివిధ రాజకీయ నాయకులకు లంచాలు ఇవ్వడంలో సం పూర్ణ బాధ్యుడెవ్వరూ, తానే ఈ లంచాలివ్వడానికి ప్రధాన కారణమని, లేదా తాను లంచాలు ఇచ్చిన వ్యక్తులను గుర్తుపడతానని చెప్పడు. అరుణ్‌జైట్లీ చెప్పినట్టు ఈ మీడియా రిపోర్టు, తనను తాను రక్షించుకోవడానికి కాంగ్రెస్‌కు సహాయపడుతోంది. సదరు మధ్యవర్తి అంతర్జాతీయ న్యాయస్థానంలో కూడా ఇదే ఆరోపణను చేయడం గమనార్హం. అయితే కోర్టు దీన్ని పరిగణలోకి తీసుకోలేదు. మళ్లీ అతగాడు దీన్ని లేవనెత్తుతున్నాడంటే అసలు సమస్యను పక్కదోవ పట్టించడానికే.
34అసహనం, భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ అంటూ ప్రచారం చేయడంలో ముందున్నవారెవరూ డాక్టర్ సుబ్రహ్మణ్యస్వామిని రాజ్యసభలో ఈ సమస్యను లేవనెత్తనీయడంలేదు. ఆమ్‌ఆద్మీ వారి భావ ప్రకటనా స్వేచ్ఛను పక్కన పెట్టండి. కొందరు పార్లమెంటేరియన్లను కూడా కాంగ్రెస్ మాట్లాడనివ్వడంలేదు. ఎందుకని వారావిధంగా చేస్తున్నాంటే ఎక్కడో వారికి సరిపడని అంశం ఉండి ఉంటుంది. ఈ పరిణామాలన్నీ కాంగ్రెస్‌కు ఎంతమాత్రం శ్రేయోదాయకం కాదు. గతంలో చేసిన వాటికి కాంగ్రెస్ కర్మఫలం అనుభవించే తరుణమిది. నాటి పాపాలకు కాంగ్రెస్ ప్రతిఫలం అనుభవించక తప్పదు.