మెయిన్ ఫీచర్

ప్రకృతే పాఠం నేర్పుతోంది..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అబ్దుల్ కలాం ముందుచూపుతో రాసిన అరుదైన లేఖ నేడు స్ఫూర్తి ప్రదాత జయంతి

ఉడతను పెంచాను పారిపోయింది
చిలుకను పెంచాను పారిపోయింది
మొక్కను పెంచాను.. ప్రస్తుతం అవి రెండు వచ్చి చేరాయి.
-అబ్దుల్ కలామ్

దేశంలో 2002లో నీటి కరువు అధికంగా ఉండడంతో అబ్దుల్ కలాంగారు 2070వ సంవత్సరంలో నీటి కరవు ఎలా వుండబోతుందో ఊహిస్తూ ఒక ఉత్తరాన్ని రాశారు. ఆ ఉత్తరాన్ని ఒక బ్రిటీష్ పత్రిక వాళ్ళకి ప్రెజెంటేషన్‌లాగా అబ్దుల్ కలాంపంపించారు. ఆయన చేసిన ఈ ఊహ చాలామందిని ప్రకృతిని పదిలంగా కాపాడుకోవాలనే బాధ్యతను గుర్తుచేసింది! ఆ ఉత్తరం యథాతథంగామీకోసం..!

ఇది 2070..!

నేను ఇప్పుడే 50 ఏళ్ళు దాటాను. కానీ నా రూపం చూడడానికి 85 ఏళ్ళుగా అనిపిస్తుంది. నేను తీవ్రమైన మూత్రపిండాల సమస్యను ఎదుర్కొంటున్నాను. ఎందుకంటే ఎక్కువగా నీరు త్రాగను, త్రాగలేను..! అంత నీరు ఇప్పుడు అందుబాటులో లేదు. నేను ఇక ఎక్కువ కాలం బ్రతకను, అదే నాకున్న పెద్ద భయం! ఇప్పుడున్న సమాజంలో.. అతి ఎక్కువ వయస్సున్న వ్యక్తులలో నేను ఒకడిని..!
నాకు గుర్తుంది.. అప్పుడు నాకు 5 ఏళ్ళు. అప్పుడంతా పరిస్థితి వేరుగా ఉండేది. ఉద్యానవనాల్లో ఎన్ని చెట్లుండేవి. ఇళ్ళలో చక్కని తోటలు ఉండేవి. దాదాపు అరగంటపాటు షవర్ స్నానం చేసి ఆనందించేవాడిని. కానీ ఇప్పుడా పరిస్థితి లేదు. ఇపుడు అంత నీరెక్కడుంది కనుక..! అందుకే మేమిప్పుడు రసాయనపూత పూసిన టవల్స్‌తో శరీరాన్ని శుభ్రపరచుకొంటున్నాం. స్నానం చేయడమనేది అసలు లేనే లేదు. రసాయనాలతో శరీరం తుడుచుకోవడమే అందరూ చేస్తున్నారు.
ఇంతకుముందు ఆడవాళ్లకు అందమైన జుట్టు ఉండేది. కానీ ఇప్పుడు నీటి వాడకం తగ్గించటానికి అందరూ తల మొత్తం నున్నగా షేవ్ చేసుకొంటున్నారు. అప్పట్లో మా నాన్నగారు కారును పైప్‌తో కడిగేవారు. ఇప్పుడా విషయం మా అబ్బాయికి చెప్తే అంత నీరెలా వృధా చేస్తారంటూ నమ్మడం లేదు. నాకు గుర్తుంది! నీటిని కాపాడండి, సేవ్ వాటర్ అంటూ హెచ్చరికలు, వాల్‌పోస్టర్లు ఉండేవి. రేడియో, టీవీల్లో కూడా ప్రచారం చేసేవారు. కానీ అప్పుడు ఎవరూ పట్టించుకోలేదు. నీరనేది ఎప్పటికీ తరగని వనరని మా భావన.
కానీ ఇప్పుడు చూస్తే నదులు, చెరువులు, బోర్లు, డ్యాములన్నీ పూర్తిగా ఎండిపోయాయి లేదా కలుషితమయ్యాయి. పరిశ్రమలు కూడా నిలిచిపోయాయి. నిరుద్యోగం దారుణంగా పెరిగిపోయింది. నీటి నుండి ఉప్పును వేరు చేసే ప్లాంట్లు మాత్రమే అధిక శాతం ఉద్యోగ అవసరాలు తీరుస్తున్నాయి. వాటిలో పనిచేసే కార్మికులు డబ్బులకు బదులుగా నీటిని జీతం రూపంలో తీసుకొంటున్నారు. నీరు కొనుక్కోవడమే గగనం అయ్యింది.
రోడ్డుమీద నీటి బాటిళ్ళు తీసుకెళ్ళేవారిని చంపి, ఆ నీటిని దోచుకొనడం కోసం చేసే నేరాలు పెరిగిపోయాయి. నీటి బాటిల్ కోసం ఆగంతకులు తుపాకీతో భయపెడుతున్నారు. 80 శాతం ఆహారమంతా కృత్రిమమే. నీరు లేకపోతే ఏం పండుతుంది?
గత రోజులలో కాస్త వయసున్న వ్యక్తి రోజుకి కనీసం 8 గ్లాసుల నీరు త్రాగాలని సిఫార్సు చేసేవారు. ఇప్పుడు కేవలం అరగ్లాసు నీరు త్రాగే అవకాశం మాత్రమే ఇస్తున్నారు. అంతకంటే ఎక్కువ నీరు త్రాగనివ్వరు. ఇప్పుడు మేము వాడి పడేసే బట్టలు ఉపయోగిస్తున్నాం. ఇంతకుముందువలే నేసిన బట్టలు వాడే రోజులు ఎప్పుడో పోయాయి. అటువంటి బట్టలు ధరించి, వాటిని శుభ్రపరచడానికి నీరుంటే కదా!
ఇప్పుడు మేము డ్రయినేజి వ్యవస్థకు బదులుగా సెప్టిక్ టాంక్ వాడుతున్నాం. ఎందుకంటే డ్రైనేజీ వ్యవస్థకు కూడా నీరు అవసరం. జనాల బాహ్యరూపం భయంకరంగా ఉంది. ముడతలు పడి, డీహైడ్రేషన్ కారణంగా కృశించి, అతినీల లోహిత కిరణాల కారణంగా శరీరం మొత్తం కురుపులు పడి, ఓజోన్ పొర లేని కారణంగా చాలా దారుణమైన చర్మవ్యాధులతో జనం తారసపడుతున్నారు.
చర్మకాన్సర్, మూత్రపిండ సంబంధిత వ్యాధులే మరణాలకు ముఖ్యకారణాలు. చర్మం అధికంగా పొడిబారడం వలన 20 ఏళ్ళ యువకులు 40 ఏళ్ళ వారిలా కనిపిస్తున్నారు. శాస్తవ్రేత్తలు పరిశోధించినా ఎటువంటి మార్గం కనుగొనలేకపోతున్నారు. నీటిని ఉత్పత్తి చేయలేం. చెట్లు పచ్చదనం తగ్గిన కారణంగా ప్రాణవాయువు నాణ్యత తగ్గిపోయింది. ఆధునిక తరాల వారి మేధాశక్తి దారుణంగా క్షీణించిపోయింది. పురుషుల వీర్యకణాలలో కూడా తేడాలు సంక్రమించాయి. ఆ కారణంగా కొత్తగా పుట్టే పిల్లలు అనేక అవయవ లోపాలతో.. రోగాలతో పుడుతున్నారు.
గాలి పీల్చుతున్నందుకుగాను ప్రభుత్వం ఇపుడు మా దగ్గరినుండి డబ్బులు వసూలు చేస్తోంది. 137 క్యూబిక్ మీటర్ల గాలి మాత్రమే తీసుకొనే అవకాశం ఇస్తుంది. ప్రజల ఊపిరితిత్తులు ఎప్పుడో చెడిపోయాయి. అందుకే ఇపుడు సౌరశక్తితో నడిచే యాంత్రికమైన ఊపిరితిత్తులు కనుగొన్నారు. వాటిని వెంటిలేటెడ్ జోన్స్ అనే ప్రత్యేక స్థలాల్లో అమరుస్తారు. డబ్బులు కట్టలేనివారిని వెంటిలేటెడ్ జోన్స్ నుండి వెళ్ళగొడతారు. అక్కడ కూడా ప్రజలు పీల్చే గాలి మంచిదేమీ కాదు. కానీ ఏదో పూట గడుస్తుందంతే. కొన్ని దేశాల్లో ఇప్పటికీ నదుల ప్రక్కన మైదానాలు ఉన్నాయి. కానీ వాటిని రక్షించడం కోసం దేశ సరిహద్దుల్లో ఉండాల్సిన సైన్యం అక్కడ ఉంది. నీరు ఎంతో ప్రియమైనదిగా మారిపోయింది. బంగారం, వజ్రాలకంటే విలువైనదిగా అయిపోయింది.
నేనుండే చోట వృక్షాలు అసలే లేవు. ఎందుకంటే అక్కడ వర్షాలు అస్సలుకే పడవు. ఎప్పుడైనా వర్షం పడినా, అది యాసిడ్ వర్షమే అవుతుంది. 20వ శతాబ్దపు పరిశ్రమలు చేసిన కాలుష్యం, అణు ప్రయోగాల కారణంగా ఋతువుల క్రమం దెబ్బతింది. అప్పట్లో ప్రకృతిని, పర్యావరణాన్ని కాపాడమని ఎందరో మొత్తుకున్నారు. కానీ ఎవరూ వినలేదు, విన్నా పట్టించుకోలేదు. నా కొడుకు నా యవ్వనం గురించి మాట్లాడమన్నపుడు పచ్చని బైళ్ళ గురించి, అందమైన పువ్వుల గురించి, వానల గురించి, నదులు, డ్యాంలలో ఈతకొట్టడం గురించి, చేపలు పట్టడం గురించి, కడుపు నిండా నీరు త్రాగడం గురించి, ప్రజల ఆరోగ్యం గురించి మాట్లాడుతాను.
అప్పుడు వాడు పో నాన్నా.. ఇప్పుడు నీళ్ళెందుకు లేవు?22 అని అడగ్గానే నా గొంతులో వెలక్కాయ పడినట్టు అవుతుంది. నాకు కలిగే అపరాధభావం నుండి బయటపడలేను. ఎందుకంటే నా తరమే పర్యవరణ వినాశానికి దోహదపడింది. ఎన్ని హెచ్చరికలు చేసినా బేఖాతరు చేసింది. ఇపుడు నా పిల్లలు దానికి భారీ మూల్యం చెల్లిస్తున్నారు. నిజాయితీగా చెప్పాలంటే ఈ భూమి మీద జీవం ఇక ఎంతోకాలం ఉండదు. పర్యావరణ విధ్వంసం దారుణమైన స్థితికి చేరుకొంది. ఇప్పుడేమి చేసినా ఫలితం ఉండదు. కాలంతో వెనక్కి వెళ్లి మానవాళికి ఎలా చెప్పాలని వుంది. ఈ భూమాతను కాపాడడానికి ఇంకా మనకు సమయం మిగిలే వుంది.. కానీ అదెలా సాధ్యం..?!
మీ
అబ్దుల్ కలాం

ఇంకా సమయం మిగిలే వుంది. భూమాతను, ప్రకృతిని కాపాడడానికి..! రండి.. చేయి చేయి కలుపుదాం.. 2002వ సం.లో 2070 పరిస్థితిని ఊహించి రాసిన ఉత్తరాన్ని చూస్తుంటే కలాం గారు రాసింది 2070 కంటే ముందే జరిగేలా వుంది. ప్రస్తుతానికి తాగడానికి, వాడుకోవడానికి నీళ్ళు ఉన్నాయని నిర్లక్ష్యం చేస్తే భవిష్యత్‌లో నీళ్ళకోసం యుద్ధాలు చేసే పరిస్థితి రావచ్చు..!

-డి.సురేష్‌బాబు 8309604656