మెయన్ ఫీచర్

సమాఖ్య ద్యుతి, రాజ్యాంగ సమీకృతి..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మన రాజ్యంగ వ్యవస్థ చరిత్ర బ్రిటన్ దురాక్రమణదారులు రూపొందించిన ‘రౌలట్’ రెగ్యులేటరీ’ చట్టాలతో మొదలౌతోందన్న కృత్రిమ పాఠాలను మన విద్యాలయంలో బోధించడం కొనసాగుతున్న భావదాస్యానికి సాక్ష్యం! ఇంటిలో తిష్టవేసి ఇంటిని కొల్లగొట్టిన ‘దొంగలు’ ప్రచారం చేసిన అబద్ధాలను దొంగలు వెళ్లిపోయిన తరువాత కూడా ఇంటిలోనివారు నమ్ముతుండడం ఈ భావదాస్యానికి చిహ్నం! ఆంగ్లేయులు మన దేశానికి వచ్చి మన నెత్తినెక్కి కూర్చున్న తరువాతనే మన దేశంలోని వివిధ ప్రాంతాల మధ్య సమైక్యం ఏర్పడిందన్నది వదలని భావదాస్యం! సంస్కృత భాషా మాధ్యమ ఉన్నత విద్యాబోధనను నిర్మూలించి ఆంగ్ల మాధ్యమ బోధనను బ్రిటన్ మేధావులు మన నెత్తికెక్కించిన తరువాతనే మనకు రాజ్యాంగ భావం ఏర్పడిందన్న భ్రాంతికి ఈ భావదాస్యం కారణం! ఇలా ‘రాజ్యాంగం’ ఏర్పడిననాటినుంచి మాత్రమే మన దేశం ఒక ‘జాతి’- నేషన్‌గా ఏర్పడిందన్నది బ్రిటన్ భావదాస్యం మనకు బోధించిన బోధిస్తున్న చరిత్ర.. అందువల్లనే మన దేశ ప్రజలు చరిత్రలో మొదటిసారిగా ఒక ‘జాతి’గా ఏర్పడుతున్నట్టు బ్రిటన్ దురాక్రమణ కొనసాగించిన కాలంలో మన పండితులు విశ్వసించారు! సురేంద్రనాథ బెనర్జీ వంటి మేధావి, కాంగ్రెస్ ఉద్యమ సంస్థ నాయకుడు 19వ శతాబ్ది చివరిలో ‘రూపొందుతున్న జాతి’- ఏ నేషన్ ఇన్ ది మేకింగ్- అన్న ఆంగ్ల పరిశోధన పత్రాన్ని వెలువరించాడు! అలా అప్పుడు ‘రూపొందుతుండిన జాతి’ బ్రిటన్ రాజకీయ దాస్య విముక్తి చెందిన తరువాతనే ఒక జాతిగా ఏర్పడిపోయిందన్నది బ్రిటన్ కల్పిత కృతక చరిత్ర.. ‘‘అదేమయ్యా మా జాతి యుగయుగాలుగా ఉంది, ప్రపంచంలోనే అతి ప్రాచీనమైన జాతి మాది.. ఇపుడు కొత్తగా జాతిగా ఏర్పడడం ఏమిటి?’’ అన్న ప్రశ్నకు ‘‘నిజమే మీది పాత దేశం, కానీ మేము మీ దేశంలో చొరబడేవరకు మీకు సమీకృత రాజ్యాంగం లేదు. రాజ్యాంగం ఏర్పడడంలో మాత్రమే ఒక దేశ ప్రజలు ‘జాతి’గా ఏర్పడుతారు. అందువల్ల మీది కొత్త జాతి’’ అని బ్రిటన్ వారు చెప్పిపోయారు! మన రాజకీయ నాయకులలోని మేధావులలోని అధికాధికులు తలలను ఊపారు! వారి తలలలో వారి బౌద్ధిక వారసుల తలలు ఇప్పటికీ తన్మయత్వంతో ఊగుతూనే వున్నాయి! ‘‘ఆహా బ్రిటన్ దొరలు వచ్చి మా దేశాన్ని సమైక్యం చేశారు. మమ్మల్ని ఒక జాతిగా తీర్చిదిద్దిపోయారు’’ అన్నది ఈ తన్మయత్వం! మన పుస్తకాలను విదేశీయ జిహాదీలు వెయ్యేళ్లపాటు తగులబెట్టారు! కానీ మన పుస్తకాలను మళ్లీ మళ్లీ మనం వ్రాసుకున్నాము, మస్తకాలలో నిక్షిప్తమైన చరిత్రను మళ్లీ మళ్లీ వ్రాసుకోగలిగాము. బ్రిటన్ ప్రభువులు విద్యావేత్తలు మన మస్తకాలను తగులబెట్టిపోయారు. ఫలితంగా అతి ప్రాచీనమైన అనాదిగా వున్న మన రాజ్యాంగ చరిత్రను మన జాతీయ చరిత్రను మనం మరచిపోయాము. అందువల్ల మన రాజ్యాంగ చరిత్ర క్రీస్తుశకం పదిహేడవ పద్దెనిమిదవ శతాబ్దాలనాటి ‘రౌలట్’ చట్టాలతో రెగ్యులేటరీ చట్టాలతో మొదలయింది. ఈ ‘చరిత్ర’ ప్రకారం మన ‘జాతి’ వయస్సు కేవలం డెబ్బయి ఏళ్లు..
యుగయుగాలుగా మహాయుగాలుగా మన్వంతరాలుగా మన దేశం ఒక ‘జాతి’గా వికసించిందని మనవారు వ్రాసిన మన చరిత్ర చెబుతోంది. అందువల్ల అనాదిగా ‘జాతి’ కేవలం డెబ్బయి ఏళ్లకు పూర్వం ‘జాతి’గా అవతరించడం ఏమిటి?? ఈ జాతీయ చరిత్రను బ్రిటన్ వారు ఐరోపావారు అంగీకరించలేదు కాబట్టి.. తమకు ఓటిపోయిన తమ ‘పాలన’లో మగ్గుతున్న ‘్భరతజాతి’కి ఇంత సుదీర్ఘ చరిత్ర ఉందని అంగీకరించడం బ్రిటన్ దురాక్రమణ మూకలకు ‘నామోషీ’! అందువల్ల వాల్మీకి వేదవ్యాసుడు వంటి వారు వ్రాసిన ‘ఇతిహాసాన్ని’ వాస్తవమని బ్రిటన్ వారు అంగీకరించలేదు. ఈ భారత జాతీయ చరిత్ర మొత్తం ‘కల్పన’ - మిత్- అని వారు నిర్థారించారు! తాము కొత్త చరిత్ర వ్రాశారు! విలియం జోన్స్, సపోర్టా, రాప్సను, మాక్స్‌ముల్లర్ వంటి పాశ్చాత్యులు ఈ కొత్త చరిత్రకు విధాతలు. బ్రిటన్ చరిత్రను జర్మనీ నియంత అడాల్ఫ్ హిట్లర్ వ్రాయిస్తే ఎలా ఉంటుంది? రావణాసురుడు రామాయణాన్ని వ్రాస్తే ఎలా వుంటుంది? అలా తయారయింది మన చరిత్ర! బావిలోని కప్పల వంటి ఐరోపా వారికి దాదాపు వేయేళ్ల క్రితం వరకు ‘జాతి’- నేషన్ - అంటే ఏమిటన్నది తెలీదు, సంస్కృతి లేదు, సమీకృత రాజ్యాంగ వ్యవస్థలు లేవు! వారికి అవగాహనకు వచ్చిన గొప్ప విషయం ‘నాగరికత’- సివిలిజేషన్! నగరాలుగా ఏర్పడినారు! ఒక నగరం ఒక దేశం! ఒక నగరం వాడు ఇతర నగరాలను జయించడం వారికి తెలిసిన సామ్రాజ్యం! ఇలా కేవలం రాజకీయానికి ఆర్థిక లాభానికి ముడివడిన ఐరోపా ప్రగతి ‘్భవి’కి పరిమితమైంది! కానీ ఐరోపా ‘కప్ప’లకు భారతదేశంలో మహాప్రవాహ దర్శనమైంది! మహాసముద్ర దర్శనమైంది! అందువల్ల భారత జాతీయ మహానదిని తమకు అవగాహన ఉన్న ‘బావి’లోకి ఇరికించడానికి ‘గెలిచిన’ బ్రిటన్ ముష్కరులు యత్నించారు!! తమ అజ్ఞానమే సకల విజ్ఞానమని భావించిన దురహంకారం ‘ఐరోపా’ను శతాబ్దుల పాటు ఆవహించింది. అందువల్లనే ‘యుగాల’ను అధిగమించిన అనంత భారత జాతీయ చరిత్రకు ఐరోపావారు ‘వేల ఏళ్ల’లోకి కుదించారు!
ఇలా కుదించిన తరువాత కూడా భారత జాతీయ చరిత్ర తమ చరిత్ర కంటే అతి ప్రాచీనమైనదని, సుదీర్ఘమైనదని బ్రిటన్ వారు ఐరోపావారు అంగీకరించక తప్పలేదు. అందువల్ల, ‘‘మీ దేశం ప్రాచీనమైనదే కాని మీరింకా ఒక ‘జాతి’గా ఏర్పడలేదు. మీ దేశం మా దేశంకంటే ప్రాచీనమైనది కాని మా జాతి మీ జాతికంటే ప్రాచీనమైనది.. మీకు ఇంకా రాజ్యాంగం ఏర్పడలేదు, చరిత్రలో ఎపుడు కూడా మీ దేశానికి మొత్తం వర్తించిన రాజ్యాంగ వ్యవస్థ లేదు. మీకు రాజ్యాంగం ఏర్పడిన తరువాత మీరు ‘జాతి’గా ఏర్పడనున్నారు..’’ అన్నది బ్రిటన్ విద్యా వ్యవస్థ మనకు నేర్పిన పాఠం. బ్రిటన్ వ్యతిరేక స్వాతంత్య్ర సమరాన్ని తొలిసారిగా ఒక జాతిగా ఏర్పడడానికి భారతీయులు జరిపిన ‘జాతీయ ఉద్యమం’గా చిత్రీకరించడం ఈ పాఠం.. ఇందుకు వీలుగా ‘‘రాజ్యాంగ వ్యవస్థ ఉన్న స్వతంత్ర దేశం మాత్రమే జాతి..’’ అన్న కొత్త అర్థాన్ని బ్రిటన్ మేధావులు కనిపెట్టారు, మన మేధావులలో అధికాధికులు తలలు ఊపారు! అందువల్ల ‘జాతి’గా మన వయస్సు కేవలం డెబ్బయ ఏళ్లు అన్నది విద్యాధిక సమాజంలో నిహితమైన అవగాహన.. అంతకు పూర్వం మనం ఒక ‘జాతి’ కాదట!
ఇంతటి పచ్చి అబద్ధాన్ని ‘వాస్తవ చరిత్ర’గా పాఠాలు చెప్పుకొని మురిసిపోతున్న మనం సిగ్గుపడాలి! ‘జాతి’ ఏర్పరచుకోగలిగిన అనేక వ్యవస్థలలో రాజ్యాంగ వ్యయస్థ కూడా ఒకటి- ఇదీ భారతీయులు చెప్పిన పాఠం! ఒక జాతి రాజ్యాంగాన్ని నిర్మించుకొంటుంది, మరోజాతి నిర్మించుకోలేకపోవచ్చు! రాజ్యాంగ వ్యవస్థ ఇలా జాతీయతలో భాగం, రాజ్యాంగ వ్యవస్థ మాత్రమే ‘జాతి’కి ప్రాతిపదిక కాజాలదు. ‘జాతీయత’ను ‘జాతి’ని ధ్రువీకరించే అనేక జీవన విభాగాలలో రాజ్యాంగ వ్యవస్థ ఒకటి! ఒక జనసముదాయం కాని, అనేక జన సముదాయాలు కాని ఒక జాతి- నేషన్‌గా ఏర్పడడానికి వౌలిక ప్రాతిపదిక తమ అస్తిత్వానికి ఆధారమైన భూమి పట్ల వారిలో సహజంగా నిహితమైన మాతృభావం! అందువల్ల ‘‘మాతా భూమిః పుత్రోహం పృథివ్యాః’’ యుగాలకు పూర్వం భారతీయులు ఎలుగెత్తినప్పటినుంచి భారతీయులు లేదా హిందువులు ఒక జాతిగా ఒకే జాతిగా ఏర్పడి ఉన్నారు! అందువల్లనే ‘్భమి తల్లి నేను ఆమెకు బిడ్డను’ అని భావించిన భారతీయులు ఈ దేశం ప్రజలు. ఆ ‘ప్రజలు జాతి’ - ‘రాష్ట్రం ప్రజాః’! మతాలు భాషలు విద్యలు వ్యవసాయాలు వాణిజ్యాలు రాజ్యాలు రాజ్యాంగాలు ‘జాతీయత’లోని అనేక వైవిధ్యాలు.. కానీ ఈ ఒక్కదానితో జాతి ఏర్పడదు.. బ్రిటన్ విముక్త భారతజాతి మరోసారి రాజ్యాంగాన్ని ఏర్పాటు చేసుకుంది. ఈ విముక్తికి డెబ్బయి ఏళ్లు, ఈ రాజ్యాంగానికి అరవై ఎనిమిదేళ్లు.. కానీ ఈ జాతికి వయస్సు అనేక యుగాలు!
ఇలా సమీకృత రాజ్యాంగ వ్యవస్థ ఏర్పడడం ఈ జాతి చరిత్రలో ఇది మొదటిసారి కాదు! యుగాల తరబడి భారతజాతి అనేకసార్లు సమీకృత రాజ్యాంగ వ్యవస్థను ఏర్పరచుకొంది, అనేకసార్లు ఈ సమీకృత రాజ్యాంగ వ్యవస్థ విచ్ఛిన్నమైంది! కారణాలు వేరు వేరు.. ఆకాశం నుంచి అవతరించిన గంగ- వాన చినుకు- స్వచ్ఛంగా వుంది. కానీ క్రమంగా కలుషితం అవుతోంది! మళ్లీ మళ్లీ ‘స్వచ్ఛ గంగ’ అవతరించింది, అవతరిస్తూనే వుంటుంది! ఇలా కలియుగం ఆరంభంనాటికి అఖండ భారతదేశం సమీకృత రాజ్యాంగ వ్యవస్థ ఏర్పడి ఉంది. ఈ వ్యవస్థ కలియుగం ముప్పయి ఎనిమిదవ శతాబ్ది వరకు కొనసాగడం భారతీయులు చెప్పిన భరతజాతి చరిత్ర.. రౌలట్ చట్టంలో రాజ్యాంగ చరిత్రను మొదలుపెట్టిన ‘దొంగలు’ చెప్పిన చరిత్ర కాదు ఇది! మన ఇంటిని తరతరాలుగా నిర్వహించిన తాత తండ్రుల, ముత్తాతల మాట నమ్మాలా? మన ఇంటికి కన్నం వేసిన బ్రిటన్ దోపిడీ దొంగల మాట నమ్మాలా??
కలియుగం ఆరంభం నాటికి అఖండ భారతదేశం యాభై రాజ్యాలుగా ఏర్పడి ఉంది! ఈ యాభై ఆరు రాజ్యాలు ‘్ఛప్పన్న’ రాజ్యాలుగా ప్రసిద్ధం. ఈ యాభై ఆరు రాజ్యాలు సమీకృత సామ్రాజ్య వ్యవస్థలో భాగంగా ఉన్నాయి. అది మిక్కిలి సరళమైన సమాఖ్య వ్యవస్థ! ఇప్పుడు ‘సమాఖ్య స్ఫూర్తి’- ఫెడరల్ స్పిరిట్ గురించి, ‘సహకార సమాఖ్య’- కోఆపరేటివ్ ఫెడరలిజం గురించి తరచు చర్చలు వ్యాఖ్యలు వాద వివాదాలు వినబడుతున్నాయి! అమెరికా సమాఖ్య వ్యవస్థ మన సమాఖ్య వ్యవస్థకంటే మరింత సరళంగా ఉండడం గురించి కూడా ప్రచారం అవుతోంది. మన వ్యవస్థ అమెరికాకు అనుగుణం కాకపోవచ్చు, అమెరికా ఫెడరల్ స్ట్రక్చర్- సమాఖ్య స్వరూపం మనకు ఆదర్శం కాజాలదు! అమెరికాలోని యాభై రాజ్యాలకూ విడివిడిగా రాజ్యాంగం ఉంది! ఈ సమైక్య రాజ్యాలకు సమానంగా వర్తించే సమాఖ్య రాజ్యాంగం కూడా ఉంది. మన దేశంలో జమ్మూకశ్మీర్‌కు తప్ప ఇలా రాజ్యాల - స్టేట్స్‌కు విడివిడి రాజ్యాంగాలు లేవు! కేంద్రీయ, ప్రాంతీయ, ఉమ్మడి జాబితాలో చేరని అవశేష అధికారాలు- రెసిడ్యుయరీ పవర్స్- మన దేశంలో కేంద్ర ప్రభుత్వానికి ఉన్నాయి, కానీ అమెరికాలో ఈ అవశేష అధికారాలు రాజ్యాలకు సంక్రమించి ఉన్నాయి. అందువల్ల ప్రాంతీయ ప్రభుత్వాలకు మన దేశంలో కంటే అమెరికాలో అధికారాలు- తులనాత్మకంగా - చాలా ఎక్కువ! ఇలా స్టేట్స్‌కు ఎంత ఎక్కువ అధికారాలు ఉంటే సమాఖ్య ఫెడరల్ స్ఫూర్తి అంత బలంగా ఉంటుందన్నది జరుగుతున్న ప్రచారం.. కలియుగాదినుంచి కలియుగం 3739వ సంవత్సరం- క్రీస్తుశకం ప్రకారం 638వ సంవత్సరం వరకు అఖండ భారతదేశం- ఇప్పటి అమెరికా సమాఖ్య కంటే మరింతగా సరళమైన వికేంద్రీకృతమైన సమాఖ్య రాజ్యాంగ వ్యవస్థగా ఏర్పడి ఉంది. కేంద్ర ప్రభుత్వం వలె సమ్రాట్టు సమాఖ్యలోని యాభై ఆరు రాజ్యాలను పర్యవేక్షించడం చరిత్ర- ఇలా కలియుగం ఆరంభం నుంచి కలియుగం ముప్ఫయి ఎనిమిదవ శతాబ్ది వరకు పదివంశాలవారు కేంద్ర ప్రభుత్వంవలె ‘సమీకృత భారత రాజ్యాంగ వ్యవస్థ’ను నిర్వహించడం చరిత్ర.. కలియుగ ఆరంభంనుంచి కలియుగం 2775- క్రీస్తునకు పూర్వం 327వ సంవత్సరం వరకు ఎనిమిది వంశాలవారు ‘గిరివ్రజం’ రాజధానిగా మొత్తం భారత ఖండాన్ని పాలించారు. అవి బృహద్రథవంశం, ప్రద్యోత వంశం, శివునాగవంశం, నందవంశం, వౌర్య వంశం, శుంగవంశం, కాణ్వ వంశం, ఆంధ్ర శాతవాహన వంశం.. ‘గిరివ్రజం’ ప్రస్తుతం బిహార్‌లో ఉంది. కలియుగం 2775 నుంచి కలియుగం 3030 - క్రీ.పూ.82వ సంవత్సరం వరకు తొమ్మిదవ మహాగుప్త రాజ వంశంవారు పాటలీపుత్రం- పాట్నా- రాజధానిగా కేంద్ర ప్రభుత్వాన్ని నిర్వహించారు. గుప్తుల రాజధాని ‘ఉజ్జయిని’ అని భ్రాంతి చెందడం బ్రిటన్‌వారికి చరిత్ర వక్రీకరణలో భాగం! కలియుగం 3030వ సంవత్సరం నుంచి పదవ - ప్రమర’ వంశంవారు ఉజ్జయిని రాజధానిగా కలియుగం 3739 - క్రీస్తుశకం 638వ సంవత్సరం వరకు సమాఖ్య రాజ్యాంగ వ్యవస్థకు ఆధ్వర్యం వహించడం చరిత్ర. ఈ ప్రమర వంశంలోని విక్రముడు, శాలివాహనుడు, శకాలను నూతన కాలగణనను ఆరంభించారు! శాలివాహన శకం ప్రస్తుతం మనకు అధికారిక జాతీయ శకం.. కలియుగం 3739 తరువాత భారత జాతీయ సమీకృత రాజ్యాంగ వ్యవస్థ విచ్ఛిన్నం కావడం మొదలైంది.. మళ్లీ కలియుగం 5052-క్రీ.శ. 1950-లో సమీకృత రాజ్యాంగం ఏర్పడింది!!

-హెబ్బార్ నాగేశ్వరరావు 9951038352