తెలంగాణ

పేదలను వంచించిన తెరాస సర్కారు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను విస్మరించి పేద ప్రజలకు తెరాస ప్రభుత్వం అన్యాయం చేసిందని కాంగ్రెస్ నేత మల్లు రవి ఆరోపించారు. ఆయన శుక్రవారం ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ, సంపన్నులకు, కాంట్రాక్టర్లకు అనుకూలంగా వ్యవహరిస్తున్న సిఎం కేసీఆర్ విద్యుత్, ఆర్టీసీ చార్జీలను పెంచి ప్రజలపై 1,800 కోట్ల రూపాయల భారాన్ని మోపారన్నారు. పెంచిన ఆర్టీసీ, విద్యుత్ చార్జీలను తగ్గించకుంటే జిల్లా, మండల కేంద్రాల్లో కాంగ్రెస్ పార్టీ ఆందోళనలు నిర్వహిస్తుందని ఆయన ప్రకటించారు. ప్రాధాన్యం లేని రంగాలకు వేలాది కోట్లను ఖర్చు చేస్తున్న ప్రభుత్వం పేదలపై ఆర్థిక భారం వేయడం దారుణమన్నారు.