జాతీయ వార్తలు

పాస్‌పోర్టు రద్దుతో రాలేకపోతున్నా: మాల్యా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దిల్లీ: భారత్‌కు రావాలన్న ఆకాంక్ష తనకు ఉన్నా, పాస్‌పోర్టును రద్దు చేయడం వల్ల రాలేకపోతున్నానని ‘లిక్కర్ కింగ్’ విజయ్ మాల్యా తెలిపారు. భారత్‌కు రావాలని తనకు లేదని గతంలో చెప్పిన ఆయన ఇపుడు మాటమార్చి- ‘సొంతగడ్డకు వెళ్లాలని ఉంద’ని అనడం గమనార్హం. ఓ కేసు విచారణ సందర్భంగా ఆయన దిల్లీలోని కోర్టుకు హాజరుకావాల్సి ఉంది. అధికారులు తన పాస్‌పోర్టును రద్దు చేయడంతో తాను రాలేకపోతున్నానని ఆయన కోర్టుకు తెలిపారు. స్టేట్ బ్యాంకు ఆఫ్ ఇండియాతో పాటు పలు ప్రభుత్వరంగ బ్యాంకులకు దాదాపు 9వేల కోట్ల రూపాయలను ఎగవేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న మాల్యా దేశం వీడి కొన్నాళ్లుగా లండన్‌లో ఉంటున్న సంగతి తెలిసిందే. బ్యాంకుల ఫిర్యాదులపై ఆయనపై పలు కేసులు నమోదయ్యాయి. వేలకోట్ల రూపాయల విలువైన మాల్యా ఆస్తులను ఈడీ అటాచ్ చేసింది.