మంచి మాట

రాఖీపూర్ణిమ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రావణపూర్ణిమనే రాఖీపౌర్ణమి వ్యవహరింపబడుతోంది. పూర్వం వేదవిద్య అధ్యయనాన్ని ఈ శ్రావణపూర్ణిమతో ప్రారంభించేవారు. దీనికి ఆరంభసూచికగానే అప్పట్లో పండితులు రాజులను, జమీందారులను, స్థితిమంతులను, పలుకుబడిగలవాళ్లను, వూరిపెద్దలను ఆశీర్వదించేవారు. వారి పాండిత్యానికి మెచ్చి ప్రభువులు, జమీందారులు బ్రాహ్మణులకు నమస్కరించి వారి ఆశీర్వచనాలు పొంది యధాశక్తిగా దానధర్మాలు చేసేవారు.పారితోషికాలను ఇచ్చేవారు. అంతేకాదు ఈ పూర్ణిమను జంధ్యాల పూర్ణిమగా కూడా పిలుస్తారు. గాయత్రీఉపాసకులకు పండుగ ఈ దినం.
ఈ పూర్ణిమ నాడే గాయత్రీ మంత్రంతో నూతన యజ్ఞోపవీతాన్ని ధరించి జీర్ణమైన యజ్ఞోపవీతాన్ని దూరం చేస్తారు. ఏవైనా ఆపదలు సంభవించినపుడు ఒకరికొకరు తోడుగా రక్షించుకుంటాము అనికూడా దీక్ష వహించి దానికి గుర్తుగా ఎర్రటి సూత్రాన్ని మణికట్టుకు కట్టుకునేవారు. అదే క్రమపరిణామంలో రక్షాబంధనం అయిం ది. నేడు అక్కచెల్లెళ్లు, అన్నదమ్ముళ్లు ఒకరికిమరొకరు తోడుగా ఉంటామని బాసచేసుకొంటూ రక్షాబంధనం కట్టుకుంటున్నారు. అన్నా చెల్లెళ్ల అనుబంధానికి చిహ్నంగా నేటి రక్షాబంధన్ శ్రావణ పూర్ణిమ పండుగ సాక్షాత్కరిస్తుంది. అన్నాచెల్లెళ్ల వాత్సల్యానుబంధాల్ని మరింతపెంచేదే ఈ రక్షాబంధనం. భారతదేశంలో జరుపుకునే పెద్దపండుగుల్లో శ్రావణ పూర్ణిమ ఒకటి. ఇలా ఒక్క అక్కచేతనో, చెల్లెలు చేతనో రక్షకట్టించుకోవడం వల్ల సోదరునికి అపమృత్యుదోషాలు పూర్తిగా తొలగింపబడుతాయి. ఆయురారోగ్యాలు, ఐశ్వర్య సుఖ సిరిసంపదలు రెట్టింపు అవుతాయని పురాణాలు చెప్తున్నాయ.
ఇతిహాసంలో కూడా దీన్ని ధ్రువపరిచే సంఘటన ఒకటి కనిపిస్తుంది. ఓసారిమనదేశాన్ని ఎలాగైనా కబళించాలనుకొన్న అలెగ్జాండర్ దండయాత్రకు వచ్చాడు. అతణ్ణి పౌరుషవంతుడు, గొప్పవాడు, ధార్మికుడైన పురుషోత్తముడు ఎదుర్కొన్నాడు. పురుషోత్తముని శక్తిసామర్థ్యాలు తెలుసుకొన్న అలెగ్జాండరు సతీమణి తనకు పతిభిక్ష పెట్టమని తన్ను చెల్లెలుగా భావించమని తన పసుపుకుంకుమలను నిలుపమని రక్షాబంధన్‌ను పురుషోత్తమునికి పంపింది. దాన్ని చూచిన పురు షోత్తముడు అలెగ్జాండరు తన తోబుట్టువు భర్తగా భావించి సంహరించకుండా తిరిగి ఆయన దేశానికి ఆయన్ను పంపించివేశాడు. ఆ రక్షాబంధన్‌కు విలువ ఇక్కడ తెలుస్తుంది. ఓసారి దేవతలకు, రాక్షసులకు జరిగిన యుద్ధంలో ఇంద్రుడు శక్తికోల్పోవడం చూచిన అతని సతీమణి భగవంతుణ్ణి ప్రార్థించి ఓ తోరాన్ని తీసుకొని ఇంద్రుని కుడిచేతికి కట్టి ఇక విజయం మీకే లభిస్తుంది అని ప్రోత్సహించిందట. ఆ శచీదేవి ఆ రక్షనుకట్టిన రోజుకూడా ఈ శ్రావణ పూర్ణిమగా చెప్తారు. ఇక అప్పట్నుంచి విజయం చేకూరాలని అందరూ ఈ రక్ష కట్టించుకునేవారట. ఆ రక్షకట్టించుకోవడమే రాను రాను రక్షాబంధన్‌గా మారిందని పెద్దలంటారు
ఈ రక్షాబంధన రోజు భిన్నత్వంలో ఏకత్వం కనిపించే భారతదేశం అఖండంగా ఆనందంగా కనిపిస్తుంది. ప్రతి స్ర్తి తన తోబుట్టువుకు రక్షకట్టి తన్ను రక్షించడానికి ముందుకు వచ్చి ఎల్లవేళలా అప్రమత్తంగా ఉండమని కోరుకుంటుంది. ఆవిధంగా తన తోబుట్టువులు నిత్యసంతోషంతో శక్తిసామర్థ్యాలతో కళకళలాడాలని దీవిస్తుంది. అన్నదమ్ములమధ్య అక్కచెల్లెళ్ల మధ్య ప్రేమానురాగాలు పెంచే ఈ రక్షాబంధన్‌ను అందరూ జరుపుకోవడం సనాతనమే. ఇలా కులమత రహితంగా జరుపుకునే ఈ రక్షాబంధన్ మానవుల్లో సహృదయతకు నాంది పలుకుతుంది. సౌభాతృత్వానికి, స్నేహానికి చిహ్నంగా నిలిచే ఈ రక్షాబంధన్ పండుగ అందరం జరుపుకుందాం. అఖండ భారతదేశ కీర్తిని ఇను మడింపచేద్దాం.
***

మంచిమాట శీర్షికకు ఆధ్యాత్మిక సంబంధమైన వ్యాసాలను సులభశైలిలో ఎవరైనా సొంతంగా రాసి పంపించవచ్చు. రచనలు పాఠకులకు ఆసక్తికరంగా వుండాలి. మూడు అరఠావులకు తగ్గకుండా వుండాలి. ప్రచురించిన రచనలకు పారితోషికం ఉంటుంది.

-నాగలక్ష్మి