జాతీయ వార్తలు

ఇన్‌ఫార్మర్ల పేరిట ఇద్దరిని హతమార్చిన మావోలుః

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాయ్‌పూర్: ఇన్‌ఫార్లర్లుగా వ్యవహరిస్తూ పోలీసులకు సహకరిస్తున్నారని ఆగ్రహించి ఇద్దరు వ్యక్తులను మావోయిస్టులు అతి కిరాతకంగా చంపిన సంఘటన సుకుమా జిల్లాలో మంగళవారం వెలుగు చూసింది. పోలంపల్లి సమీపంలో పొలం నుంచి వస్తున్న ఓ వ్యక్తిని పట్టుకుని మావోలు కత్తులతో పొడిచి చంపారు. రోకెల్ గ్రామంలో మరో వ్యక్తిని అతని కుటుంబ సభ్యుల ఎదుటే నరికి చంపారు. గిరిజన గ్రామాల్లో పోలీసు ఔట్‌పోస్టుల ఏర్పాటు ఈ ఇద్దరూ సహకరించినందున హతమార్చామని రాసిన లేఖలను మృతదేహాల వద్ద మావోలు వదిలిపెట్టారు.