రాష్ట్రీయం

సెక్స్‌రాకెట్‌ను అంతం చేస్తాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రభుత్వం రక్షించే ప్రయత్నాలు చేస్తుంది
దృష్టి మళ్లించేందుకే అంగన్‌వాడీల తొలగింపు
మావోయిస్టుల హెచ్చరిక లేఖ
విజయవాడ, డిసెంబర్ 28: కాల్‌మనీ సెక్స్ రాకెట్‌లోని దుర్మార్గులను ప్రభుత్వం రక్షించే ప్రయత్నం చేస్తోందని కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ ఇండియా (మావోయిస్టు) రాష్ట్ర కమిటీ ఆరోపించింది.
కాల్‌మనీ దోషులపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోనిపక్షంలో ప్రజాకోర్టులో తామే హతమారుస్తామని సోమవారం మీడియాకు పంపిన లేఖల్లో హెచ్చరించింది. కాల్‌మనీ నుంచి దృష్టి మళ్లించేందుకే సిఎం వ్యూహాత్మకంగా అంగన్‌వాడీ కార్మికుల తొలగింపు చర్యలు చేపట్టారని ఆరోపించింది. సెక్స్ రాకెట్‌లో తెదేపా నేతలు ఉండటంతో, వాళ్లను రక్షించేందుకు సిఎం నక్కిజిత్తులు ప్రయోగిస్తున్నాడని తీవ్రంగా ఆరోపించింది.
మావోయిస్టులు ప్రజల్లో తమ సానుభూతి పెంచుకోడానికే కాల్‌మనీ ఉదంతాన్ని అవకాశంగా తీసుకున్నట్టు కనిపిస్తోందని నగర పోలీస్ కమిషనర్ గౌతం సవాంగ్ ప్రకటనలో పేర్కొన్నారు. ప్రజాస్వామ్యంలో ప్రజలు ఎదుర్కొంటున్న ఎన్నో సమస్యలు చట్టపరంగా పరిష్కారం అవుతున్నాయన్నారు. మావోల హింసాత్మక ధోరణి, చట్టవ్యతిరేక కార్యకలాపాల వల్ల ఎందరో అమాయక ప్రజలు, యువకుల ప్రాణాలు పొగొట్టుకుంటున్నారన్నారు. కాల్‌మనీ వ్యవస్థను అణచేయడానికి పోలీస్ శాఖ తీసుకుంటున్న చర్యలపై ప్రజాస్పందన రావడం చూసి, ఇప్పటి వరకూ నోరువిప్పని మావోలు సానుభూతి కోసం ప్రయత్నిస్తున్నారని సవాంగ్ స్పష్టం చేశారు.