జాతీయ వార్తలు
మథుర అల్లర్లలో 104 మందిపై ఎఫ్ఐఆర్
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Saturday, 3 September 2016
మథుర: ఉత్తరప్రదేశ్లోని మథురలో ఇటీవల జరిగిన జవహార్ పార్కు అల్లర్ల ఘటనలో ప్రధాన సూత్రధారి రామ్ వృక్ష్ యాదవ్ సహా మరో 104 మంది నిందితులుగా తేలడంతో వారిపై ఎఫ్ఐఆర్ నమోదైంది. కోర్టు ఆదేశాల మేరకు గత జూన్ 2న జవహార్ పార్కును పోలీసులు స్వాధీనం చేసుకునే ప్రయత్నం చేయగా స్థానికులు అడ్డుకున్నారు. ఇరు వర్గాల మధ్య జరిగిన ఘర్షణలో ఇద్దరు పోలీసులు సహా 26 మంది మృతిచెందారు. ఇప్పటి వరకు 65 మంది నుంచి వాంగ్మూలం నమోదు చేశారు.