మహబూబ్‌నగర్

ఫాస్ట్‌ట్రాక్ కోర్టు ప్రారంభం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నాగర్‌కర్నూల్, అక్టోబర్ 2:నాగర్‌కర్నూల్ కోర్టు ఆవరణలో ఆదివారం జిల్లా నాల్గవ అదనపు కోర్టు (్ఫస్ట్‌ట్రాక్)ను ఉమ్మడి రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తి సీతారామమూర్తి ప్రారంభించారు. ఫాస్ట్‌ట్రాక్ కోర్టు న్యాయమూర్తిగా నియమితులైన రాధాదేవి బాధ్యతలను స్వీకరించి, తొలికేసుపై న్యాయవాదుల వాదనలను విన్నారు. అంతకుముందు కోర్టు ఆవరణలో హైకోర్టు న్యాయమూర్తి సీతారామమూర్తి మొక్కలు నాటారు.
కార్యక్రమంలో ఎమ్మెల్సీ, ఆల్ ఇండియా బార్ కౌన్సిల్ సభ్యులు రాంచంద్రరావు, రాష్ట్ర బార్ కౌన్సిల్ చైర్మన్ అనంత నర్సింహా రెడ్డి, జిల్లా కోర్టు న్యాయమూర్తి వెంకట కృష్ణయ్య, అదనపున్యాయమూర్తులు బిక్షపతి, ప్రభాకర్, రాధాదేవి, ఇతర న్యాయమూర్తులు మాధవి, నారాయణలతోపాటు స్థానిక బార్ కౌన్సిల్ చైర్మన్ నర్సింహ్మారెడ్డి, కార్యదర్శి యాదగిరిరావుతోపాటువివిధ ప్రాంతాల నుంచి వచ్చిన న్యాయవాదులు పాల్గొన్నారు.