మహబూబ్‌నగర్

గద్వాల జిల్లా కోరుతూ ఆర్యవైశ్యుల రక్తదానం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గద్వాలటౌన్, అక్టోబర్ 2: ‘రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు మా రక్తం తీసుకొని గద్వాల జిల్లా ఇవ్వాలని’ కోరుతూ ఆర్యవైశ్యులు రక్తదానం చేశారు. ఆదివారం గాంధీజయంతి సందర్భంగా ఆర్యవైశ్య ఆఫిషియల్స్, ప్రొఫెనల్స్, అసోసియేషన్ ఆధ్వర్యంలో స్థానిక టిఎన్‌జిఓ భవన్‌లో రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు. పట్టణంలో రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా అవోపో పట్టణ అధ్యక్షుడు శ్రీకాంత్ మాట్లాడుతూ గత సంవత్సర కాలంగా గద్వాల జిల్లా కావాలని ప్రతిపక్ష, పాలకపక్ష పార్టీల, ఉద్యమశక్తులు, వ్యాపార సంఘాలు సకలజనులు ఏకమై పోరుబాట పట్టిన విషయం తెలిసిందేనన్నారు. మా రక్తం తీసుకొని గద్వాల జిల్లా ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ శిబిరంలో117 మంది పాల్గొని రక్తదానం చేశారు. ఈ కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి అల్లంపల్లి వెంకటేశ్వర్లు, అయిజత ఎంపిపి సుందర్‌రాజు, కాంగ్రెస్ నాయకులు గడ్డంకృష్ణారెడ్డి, జెఎసి నాయకులు, ఇండియన్ రెడ్‌క్రాస్ సొసైటీ రమేష్, విద్యాసంస్థల నాయకులు, ఆర్యవైశ్యులు పాల్గొన్నారు.