మహబూబ్‌నగర్

జగ్జీవన్‌రాం జయంతి వేడుకల్లో పాల్గొన్న మంత్రి జూపల్లి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కొత్తకోట, ఏప్రిల్ 5: బాబు జగ్జీవన్ రాం 109వ జయంతి వేడుకలకు మంగళవారం ఘనంగా జరుపుకున్నారు. పట్టణంలోని ఆయన చిత్రపటానికి రాష్ట్ర భారీ పరిశ్రమల శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావుపూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈసందర్బంగా మంత్రి జూపల్లి కృష్ణారావు మాట్లాడుతూ దళితుల అభివృద్ధి కోసం కృషిచేసిన మహానీయుడని, ఆయన అడుగుజాడల్లో ప్రతి ఒక్కరు పయనించాలని అన్నారు. ఆలాగే పట్టణంలోని కాంగ్రెస్, టిడిపి, టి ఆర్ ఎస్ పార్టీల ఆద్వర్యంలో బాబు జగ్జీవన్ రాం విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. తహశీల్దార్ ఆద్వర్యంలో ఎంపిపి గుంతవౌనిక, తహశీల్దార్ రాజేందర్‌గౌడ్, ఎంపిడివోసుదర్శన్, సర్పంచ్ చెన్నకేశవరెడ్డి, జడ్పిటిసి పిజె బాబు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈకార్యక్రమంలో నాయకులు ప్రశాంత్, వామన్‌గౌడ్, మేస్ర్తీశ్రీను, భరత్‌బూషన్, టిసి నాగన్న, ప్రేమదానం, ఇజ్రాయిల్, బోయేజు, సుల్తాన్, వెంకటరమణ, ప్రశాంత్, బాబురెడ్డి, రవీందర్‌రెడ్డి, నాగన్నసాగర్, లతీఫ్, కటికెశ్రీను, జగదీష్, పెంటన్నయాదవ్, తదితరులు పాల్గొన్నారు.