మహబూబ్‌నగర్

కన్నుల పండువగా గోదా కల్యాణం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కొల్లాపూర్, జనవరి 13: పట్టణంలోని శ్రీరామమందీరంలో కన్నుల పండువగా గోదాదేవి, రంగనాథుల కళ్యాణోత్సవం వైభవంగా జరిగింది. ప్రతి యేడాది సంక్రాంతి పండుగ పురస్కరించుకొని భోగి పండుగరోజు స్వామివారి కళ్యాణోత్సవం జరుగుతుంది. కళ్యాణోత్సవానికి ముందు శ్రీరామయువసేన ఆధ్వర్యంలో యువకులు పట్టణంలో ద్విచక్ర వాహానాలతో ర్యాలీ నిర్వహించగా పట్టణవాసులను ఎంతో ఆకట్టుకుంది. స్వామివారి కళ్యాణోత్సవంలో పంచాయతీరాజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు, ఎంపిపి చిన్ననిరంజన్‌రావు, జడ్పీటిసి హన్మంతునాయక్, మాజీ ఎంపిపి నరేందర్‌రెడ్డి, కాంగ్రెస్ పార్టీ నాయకులు జగదీశ్వర్, కాటం జంబులయ్య పాల్గొన్నారు. మధ్యాహ్నం అన్నదాన కార్యక్రమం జరిగింది. సంక్రాంతి పండుగ పురస్కరించుకొని సింగోటం శ్రీవారి సముద్రం చెరువులో మిషన్ బోటింగ్‌ను మంత్రి జూపల్లి కృష్ణారావు ప్రారంభించారు. జాతరకు వచ్చే యాత్రీకులకోసం సింగోటం శ్రీవారి సముద్రం చెరువులో మిషన్ బోటు సౌకర్యం కల్పిస్తున్నట్లు ఆలయ కమిటి వారు తెలిపారు. జాతరకు వచ్చే భక్తులకోసం అన్నీ ఏర్పాట్లు పూర్తి చేసినట్లు తెలిపారు.
చిన్నచింతకుంటలో...
చిన్నచింతకుంట: పల్లె ప్రజల ఆరాధ్యదైవంగా విరాజిల్లుతూ తిరుమల తిరుపతి వెంకటేశ్వరుడి ప్రతిరూపంగా కొలువబడుతున్న శ్రీ కురుమూర్తి దేవస్థానంలో ధనుర్మాస పూజల్లో భాగంగా శుక్రవారం గోదాదేవి కళ్యాణాన్ని వైభవంగా నిర్వహించారు. సంప్రాదాయం ప్రకారం గోదాదేవి కళ్యాణాన్ని ఆలయ ఆర్చకులు శ్రీనివాసులు వేదమంత్రోత్సవ మధ్య వైభవంగా నిర్వహించారు. గోదాదేవి కళ్యాణంలో చుట్టు ప్రక్కల గ్రామాల నుంచి నూతన ధంపతులు పాల్గొని పుణితులయ్యారు. గోదాదేవి తిలకించేందుకు భక్తులు పొట్టెత్తారు. ఈ కార్యక్రమంలో దేవస్థాన ఇఓ గురురాజా, సిబ్బంది సాయిరెడ్డి, శివనంద చారి, ఆర్చకులు, భక్తులు పాల్గొన్నారు.