మహబూబ్‌నగర్

సిఎం కార్యాలయం వద్ద యువ రైతు ఆత్మహత్యాయత్నం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గట్టు, మే 16: ప్రజా సమస్యల పరిష్కారానికి వేదికగా హైదరాబాద్‌లో ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయం ప్రగతిభవన్ వద్ద మంగళవారం గట్టు మండలం ఆలూరు గ్రామానికి చెందిన యువ రైతు మల్లేష్ ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. గత కొంత కాలంగా తీవ్ర మనోవేదనకు గురై అప్పుల ఊబిలో కూరుకుపోయిన మల్లేష్ ప్రభుత్వం ఆర్థిక సహాయం అందించాలని పలుమార్లు జిల్లా కలెక్టర్‌తోపాటు ముఖ్యమంత్రి కార్యాలయంలో ఫిర్యాదు చేశారు. అప్పుల బాధలు పెరగడంతో మనస్థాపానికి చెందిన మల్లేష్ మంగళవారం హైదరాబాద్ ప్రగతి భవన్ వద్ద పురుగుల మందు సేవించి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. అక్కడి అధికారులు, పోలీసులు హుటాహుటిన మల్లేష్‌ను గాంధీ ఆస్పత్రికి చికిత్స నిమిత్తం తరలించారు. ఈ విషయాన్ని తెలుసుకున్న గద్వాల మాజీ ఎమ్మెల్యే డికె భరతసింహారెడ్డి గాంధీ ఆస్పత్రిలో మల్లేష్‌ను పరామర్శించి ఆర్థిక సహాయం అందించారు. జోగుళాంబ గద్వాల జిల్లా కలెక్టర్ రజత్‌కుమార్‌సైనీ ఆలూరు గ్రామాన్ని సందర్శించి బాధితుడి కుటుంబ సభ్యులతో మాట్లాడారు. తక్షణ సహాయం కింద రూ.2 వేల నగదు, 50 కేజీల బియ్యం అందించాలని తహశీల్దార్‌ను ఆదేశించారు. ప్రభుత్వ పరంగా ఆదుకునేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నట్టు కలెక్టర్ హామీ ఇచ్చారు. కలెక్టర్ వెంట తహశీల్దార్ రాజు, విఆర్‌ఓ విష్ణు తదితరులు ఉన్నారు.