మహబూబ్‌నగర్

పత్తి రైతు ఆత్మహత్య

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జడ్చర్ల, డిసెంబర్ 17: అప్పులు తీర్చలేక పత్తి రైతు ఆత్మహత్య చేసుకున్న సంఘటన ఆదివారం మండల పరిధిలోని లింగంపేట్ గ్రామంలో చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన వెంకటయ్య (40) అనే రైతు తనకు స్వంత పొలంలోని మూడు ఎకరాలల్లో పత్తిపంటను సాగు చేయడంతో పాటు గ్రామానికి చెందిన జితేందర్‌రెడ్డి అనే రైతు వద్ద మరో మూడు ఎకరాల పొలాన్ని తీసుకొన్ని మొక్కజొన్న పంటలను సాగు చేశారు. పంటల దిగుబడి సక్రమంగా రాకపోవడంతో ఆయన తీవ్ర మనోవేదనకు గురయ్యారు. అంతేకాక పంటల సాగుకోసం చేసిన అప్పులు తీర్చే మార్గం కనిపించకపోవడంతో తనదీన స్థితిని భార్య తో చెన్నమ్మతో పలుమార్లు చెప్పుకొని ఆవేధన వ్యక్తం చేశారు.
శనివారం సాయంత్రం వంట చెఱుకు తెస్తానని వెళ్లిరాత్రంతా కనిపించకపోవడంతో కుటుంబ సభ్యులు, గ్రామస్థులు శనివారం రాత్రంతా గ్రామ చుట్టుపక్కల వేతికారు. ఆదివారం ఉదయం ఆయన కోసం వెతుకుతున్న తరుణంలో గ్రామస్థులకు తాను కౌలుకు తీసుకున్న వ్యవసాయ పొలం సమీపంలో గల మామిడి చెట్టుకు ఉరి వేసుకొని కనిపించాడు. పత్తిపంట సాగుకు సంబందించి తీవ్ర నష్టం వాటిల్లినందునే వెంకటయ్య ఆత్మహత్య చేసుకున్నట్లు మృతుడు వెంకటయ్య బార్య చెన్నమ్మ పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకొని ధర్యాప్తు జరపనున్నట్లు సిఐ బాల్‌రాజ్ తెలిపారు. మృతుడికి భార్య, ఇద్దరు కూతుళ్లు ఉన్నారు.
టిడిపి జిల్లా అధ్యక్షుడి పరామర్శ
అప్పులు తీర్చలేక ఆత్మహత్య చేసుకున్న వెంకటయ్య కుటుంబ సభ్యులను టిడిపి జిల్లా అధ్యక్షుడు ఎర్రశేఖర్ ఆదివారం పరామర్శించారు. పత్తి పంటకు ప్రభుత్వం సరైన ధర కల్పించకపోవడం వల్లే రైతు వెంకటయ్య ఆత్మహత్య చేసుకున్నాడని ఆయన అన్నారు.