మహబూబ్నగర్
కొత్త పాస్ పుస్తకాల పంపిణీకి చర్యలు
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
నాగర్కర్నూల్, జనవరి 16: జిల్లాలో అర్హులైన రైతులందరికి మార్చి 11న కొత్త పాస్ పుస్తకాలు ఇచ్చేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు జిల్లా కలెక్టర్ ఈ.శ్రీ్ధర్ వెల్లడించారు. బుధవారం సాయంత్రం కలెక్టరేట్లోని సమావేశం హాల్లో నిర్వహించిన జిల్లా అధికారుల సమావేశంలో పల్స్ పోలియో, గణతంత్ర దినోత్సవ వేడుకలు, కొత్త పాస్ పుస్తకాల పంపిణీ, హరితహారం తదితర వాటిపై సమీక్షించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ కొత్త పాస్ పుస్తకాలు పంపిణీకై ప్రతి గ్రామానికి నోడల్ అధికారిని నియమించాలని, వారికి వీఆర్వో, వీఆర్ఏలు సహాయకులుగా ఉంటారని అన్నారు. జిల్లాలో 95శాతం భూములు క్లియర్గా ఉన్నట్లు భూ రికార్డుల పరిశీలనలో తేలిందన్నారు. వీరందరికి మార్చి 11న కొత్త పాస్ పుస్తకాలను ఇవ్వనున్నట్లు తెలిపారు. ఈనెల 26న గణతంత్ర దినోత్సవ వేడుకలను వేడుకలు ప్రజలను ఆకట్టుకునేలా ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. అన్నీ శాఖలకు చెందిన శకటాలను ప్రదర్శించాలని ఆదేశించారు. జనవరి 28, మార్చి 11న నిర్వహించే పల్స్పోలియో కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు అవసరమైన అన్నీ రకాల చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఫిబ్రవరి 9న నిర్వహించే నులిపురుగుల నిర్మూలన బిళ్లల పంపిణీకి అన్నీ ఏర్పాట్లు చేయాలని, 1నుంచి 19ఏళ్లలోపు పిల్లలకు ఈ బిల్లలను విధిగా వేయాలన్నారు. ఈ కార్యక్రమంలో జేసీ సురేందర్ కరణ్, అదనపు ఎస్పీ చెన్నయ్య, డీఆర్వో మధుసూధన్నాయక్తోపాటు వివిధ శాఖల అధికారులు జోజీ, సుధాకర్లాల్ తదితరులు ఉన్నారు.