క్రైమ్/లీగల్

రైలు కింద పడి యువకుడు ఆత్మహత్య

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కొత్తకోట, మార్చి 15: మదనాపురం రైల్వే స్టేషన్ సమీపంలోని గురువారం ఉదయం ప్యాసింజర్ రైలు కింద పడి పాత్లావత్ శంకర్‌నాయక్ (26) అనే యువకుడు ఆత్మహత్యకు పాల్పడినట్లు రైల్వే పోలీసు అధికారి రాఘవేందర్ తెలిపారు. రైల్వే పోలీసుల కథనం ప్రకారం కొత్తకోట మండలం వడ్డెవాట తండాకు చెండిన గోపాల్‌నాయక్, దేవమ్మ మొదటి కుమారుడు పాత్లావత్ శంకర్‌నాయక్ తండ్రితో బుధవారం రాత్రి గొడవ పడి మనస్తాపానికి గురై మదనాపురం రైల్వే స్టేషన్ పరిధిలోని గేట్ సమీపంలోని గేట్‌మ్యాన్ వద్ద మాట్లాడుతూ కర్నూల్ నుండి హైదరాబాద్‌కు వెళ్ళే ప్యాసింజర్ రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. తలకు బలమైన గాయం కావడంతో శంకర్‌నాయక్ అక్కడికక్కడే మృతిచెందాడు. శంకర్‌నాయక్ వనపర్తిలోని ద్విచక్రవాహనం షోరూంలో సూపర్‌వైజర్‌గా విధులు నిర్వహిస్తున్నాడు. కాగా ఆ యువకునికి నాగవరం తండాకు చెందిన యువతితో పెళ్లి నిశ్చయమైందని, ఏప్రిల్‌లో వివాహం చేయాలని పెద్దలు నిర్ణయంచారు. ఇంతలోనే ఆత్మహత్యకు పూనుకున్నాడు. మృతునికి తమ్ముడు, చెల్లులు ఉన్నారు. శవాన్ని పోస్టుమార్టం నిమిత్తం గద్వాల ఏరియా ఆసుపత్రికి తరలించి పంచనామా నిర్వహించినట్లు తెలిపారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు జరుపుతున్నట్లు రైల్వే పోలీసులు తెలిపారు.