మహబూబ్‌నగర్

మాదాసి కురువల ధర్నా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ధన్వాడ, జూన్ 21: ఎస్సీ కుల ధ్రువీకరణ పత్రం జారీ చేయాలని కోరుతూ గురువారం మాదాసి కురువలు మరికల్‌లోని తహశీల్దార్ కార్యాలయం ముందు ధర్నా చేశారు. అంతకు ముందు మాదాసి కురువలు మరికల్‌లోని ఇందిరాగాంధీ చౌరస్తా వరకు భారీ ఎత్తున్న డప్పులతో ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా మాదాసి కురువ సంఘం మరికల్ మండల అధ్యక్షులు కస్పే సతీష్‌కుమార్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రప్రభుత్వం వేంటనే మాదాసి కురువలకు ఎస్సీ కుల ధ్రువీకరణ పత్రంను ఇవ్వాలని డిమాండ్ చేశారు. అనంతరం మరికల్ మండల తహశీల్దార్ కార్యాలయం ముందు ఉన్న అంబ్కేర్ విగ్రహాన్నికి వినతి పత్రం అందజేశారు. అనంతరం మండల డిప్యూటీ తహశీల్దార్ శ్రీనివాసులుకు పలు డిమాండ్లతో కూడిన వినతిపత్రంను అందజేశారు. ఈకార్యక్రమంలో మరికల్ మండల మాదాసి కురువ సంఘం కమిటీ సభ్యులు మల్లేష్, ఎల్.రాములు, ఎల్.తిరుపతయ్య, భీంరాజు, ఎర్రప్ప,మోనప్ప,లక్ష్మీయ్య పాల్గొన్నారు.