మహబూబ్‌నగర్

ఘనంగా రామచంద్రజీ జయంతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కొత్తూరు, ఏప్రిల్ 30: ధ్యాన గురువు రామచంద్రజీ (బాబుజీ) 117వ జయంతిని ఘనంగా నిర్వహించారు. రామచంద్ర మిషన్‌లో నిర్వహించిన జయంతి కార్యక్రమానికి 100దేశాల నుండి 30వేల ప్రతినిధులు హాజరయ్యారు. శనివారం కొత్తూరు మండలం చేగూరు గ్రామం సమీపంలోని రామచంద్ర మిషన్ ప్రాంగణంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన కనశాంతివనంలో జయంతి కార్యక్రమాన్ని నిర్వహించారు. ధ్యాన గురువు రామచంద్రాజీ (బాబుజీ) 117వ జయంతిని ఘనంగా నిర్వహించి, ఈసంధర్భంగా ఈనెల 29వ తేది నుండి మే 1 వరకు యోగా శిక్షణ శిబిరం నిర్వహిస్తున్నారు. ఈ యోగా శిక్షణ శిబిరాన్ని ప్రముఖ యోగా గురువు కమలేష్ డి పటేల్ ప్రారంభించారు. ఈ కార్యక్రమాలకు 100దేశాలకు చెందిన సుమారు 30వేల మంది ప్రతినిధులు హాజరయ్యారు. ఈ కార్యక్రమానికి హాజరైన ప్రతినిధుల సౌకర్యం కోసం రామచంద్ర మిషన్ ఆధ్వర్యంలో అన్ని ఏర్పాట్లు చేశారు. దీనికి తోడు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా కొత్తూరు పోలీసులు పూర్తి బందోబస్తును ఏర్పాటు చేశారు. రామచంద్ర మిషన్ ధ్యాన సభలకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా నిర్వహకులు అన్ని ఏర్పాట్లు చేశారు. రవాణా సౌకర్యార్ధం ప్రత్యేకంగా బస్సులను ఏర్పాటు చేయడంతో పాటు కొత్తూరు, షాద్‌నగర్, జడ్చర్ల రైల్వే స్టేషన్లలో రైళ్లు నిలిచే విధంగా ఏర్పాట్లు చేసినట్లు నిర్వహకుడు మధుసూదన్‌రెడ్డి తెలిపారు.