మహబూబ్‌నగర్

మోదీ ప్రభంజనాన్ని ఆపలేరు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నాగర్‌కర్నూల్, ఆగస్టు 13: దేశంలో ప్రజలు తిరస్కరించిన పార్టీలన్నీ ఏకమైనా ప్రధాని మోదీ ప్రభంజనాన్ని ఆపలేరని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ అన్నారు. సోమవారం నాగర్‌కర్నూల్‌లో బీజేపీ జిల్లా అధ్యక్షుడు సుబ్బారెడ్డి అధ్యక్షతన జరిగిన సమావేశంలో లక్ష్మణ్ మాట్లాడుతూ దేశంలోని అన్ని కులాలను, మతాలను, ప్రాంతాలను ఏకం చేసిన ఘనత బీజేపీకే దక్కుతుందన్నారు. ప్రధానిగా మోదీ బాధ్యతలు తీసుకున్న తరువాత జరిగిన అన్నీ ఎన్నికలలో కూడా బీజేపీ ఘన విజయం సాధిస్తూ వస్తోందని.. రాబోయే ఎన్నికల్లో కూడా బీజేపీ ప్రభంజనాన్ని సృష్టిస్తుందన్నారు. అంబేద్కర్‌ను పార్లమెంట్ రాకుండా ఓడించిన ఘనత కాంగ్రెస్‌కే దక్కుతుందని, అలాంటి కాంగ్రెస్ నేడు అంబేద్కర్‌పై, ఎస్సీ, ఎస్టీలపై మొసలికన్నీరు పెడుతోందని ఆరోపించారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, మహిళా సంక్షేమం కోసం ఎవ్వరు చిత్తశుద్ధితో పని చేశారనే దానిపై బహిరంగ చర్చకు రావాలని ఆయన పీసీసీ అధ్యక్షుడికి సవాల్ విసిరారు. దళితుడిని ముఖ్యమంత్రిని చేస్తానని, దళితులకు మూడు ఎకరాల భూమి ఇస్తానని చెప్పి మోసం చేసిన కేసీఆర్‌కు ఎన్నికలలో దళితులు తగిన బుద్ధి చెప్పడం ఖాయమన్నారు.