మహబూబ్‌నగర్

ఈ గెలుపు ప్రజలకు అంకితం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జడ్చర్ల, డిసెంబర్ 11: జడ్చర్ల శాసన సభ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన మంత్రి లక్ష్మారెడ్డి మంగళవారం మీడియాతో మాట్లాడుతూ తన ఈ గెలుపు ప్రజలకు అంకితం చేస్తున్నట్లు తెలిపారు. ఎంతో ఆదరాభిమానాలతో ముచ్చటగా మూడోసారి తనను గెలిపించనందుకు జడ్చర్ల నియోజకవర్గ ప్రజలకు ఎంతో ఋణపడి ఉన్నానని, అందువల్ల తన జీవితాన్ని ప్రజాసేవకు అంకితం చేస్తున్నాని ఆయన భావోద్వేగంతో అన్నారు. జడ్చర్ల నియోజకవర్గ ప్రజలు, ముఖ్యమంత్రి కెసీఆర్‌ల ఆశీర్వాదం వల్లనే తాను రాజకీయాలల్లో ఈ స్థితిలో ఉన్నానని ఆయన పేర్కొన్నారు. తెలంగాణ ఉద్యమ సమయంలో రాష్ట్ర సాధన కోసం పదవి ని తృణ ప్రాయంగా త్యజించి ఉద్యమించానని, తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తరువాత ముఖ్యమంత్రి కెసీఆర్ ప్రోద్భలంతో రాష్ట్ర అభివృద్ధిలో భాగస్వామినయ్యానన్నారు. తాను ఎమ్మెల్యేగా, మంత్రిగా కొనసాగినంత కాలం నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేయడం వల్లే ప్రజలు మరోసారి ఆదరించి ఓట్ల వర్షంలో తడిపిముద్ద చేశారని ఆయన పేర్కొన్నారు. జడ్చర్ల నియోజకవర్గ చరిత్రలోనే భారీ మెజార్టీతో తనను గెలిపించడం ఎంతో సంతోషమని, జడ్చర్ల ప్రజలకు సేవ చేసి వారి ఋణం తీర్చుకుంటానని మంత్రి పేర్కొన్నారు. అంతేకాక పాలమూరు ఎత్తిపోతల పథకాన్ని యుద్ద ప్రాతిపదికన పూర్తి చేసి జడ్చర్ల నియోజకవర్గాన్ని సస్యశ్యామలం చేస్తానని ఆయన అన్నారు. ప్రజలు ఇచ్చిన తీర్పుతో మరింత ఉత్సాహంతో పని చేసి జడ్చర్ల అభివృద్ధికి చిత్తశుద్ధితో కృషి చేస్తానని నియోజకవర్గ సర్వతోముఖాభివృద్ధికి పాటు పడతానని ఆయన తెలిపారు.