మహబూబ్‌నగర్

మోగిన పంచాయతీ ఎన్నికల నగారా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మహబూబ్‌నగర్, జనవరి 1: ఉత్కంఠతకు తెరపడింది. ఎప్పుడెప్పుడా అంటూ ఎదురుచూస్తున్న గ్రామపంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్‌ను రాష్ట్ర ఎన్నికల కమిషన్ విడుదల చేసింది. మంగళవారం పంచాయతీ ఎన్నికలకు సంబంధించిన నోటిఫికేషన్‌ను విడుదల చేయడంతో గ్రామాల్లో ఒక్కసారిగా ఎన్నికల వాతావరణం నెలకొంది. జిల్లాలో గ్రామపంచాయతీ ఎన్నికల కోలాహలం ప్రారంభమైంది. గత వారం రోజులుగా ఎప్పుడెప్పుడా అని చర్చించుకుంటున్న తరుణంలో గ్రామపంచాయతీ ఎన్నికలకు నోటిఫికేషన్ ఎట్టకేలకు విడుదలైంది. ఈసందర్భంగా జిల్లా ఎన్నికల అధికారులకు ఆదేశాలు కూడా అందాయి. మొదటిదశ ఎన్నికలను జనవరి 21వ తేదిన రెండవదశ ఎన్నికలను జనవరి 25న, మూడవదశ ఎన్నికలను జనవరి 30వ తేదీన నిర్వహించేందుకు రాష్ట్ర ఎన్నికల కమిషన్ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నెల 7వ తేది నుండి 9వ తేదీ వరకు మొదటిదశ జరిగే గ్రామపంచాయతీ ఎన్నికలకు సంబంధించి నామినేషన్లను స్వీకరించనున్నారు. 10న నామినేషన్ల పరిశీలన, 13న నామినేషన్ల ఉపసంహరణ జరగనుంది. మొదటిదశ ఎన్నికల ప్రచారం గడువు 19వ తేది 5గంటల వరకు ముగియనుంది. అదేవిధంగా ఈ నెల 11 నుండి 13 వరకు రెండవదశ గ్రామపంచాయతీ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ పూర్తి కానుంది. 14న నామినేషన్ల పరిశీలన, 17న నామినేషన్ల ఉపసంహరణ జరగనుంది. రెండవ దశ పోలింగ్ 25వ తేదీన పూర్తి కానుంది. ఈ నెల 30వ తేదదీన మూడవ దశ గ్రామపంచాయతీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికలకు సంబంధించి 16వ తేది నుండి 18వ తేది వరకు నామినేషన్ల స్వీకరణ, 19వ తేదిన నామినేషన్ల పరిశీలన, 22వ తేదీన నామినేషన్ల ఉపసంహరణ, 30వ తేదీన పోలింగ్ జరగనుంది. ఉదయం 7గంటల నుండి మధ్యాహ్నం ఒంటి గంట వరకు పోలింగ్ జరగనుంది. 2గంటల నుండి ఓట్లలెక్కింపు ప్రక్రియ కొనసాగనుంది. అదేరోజు సర్పంచుల ఎన్నిక కూడా పూర్తి కానుంది. ఉపసర్పంచ్ ఎన్నికలు కూడా అదేరోజు నోటిఫికేషన్ అక్కడి ఎన్నికల అధికారులు పూర్తి చేయనున్నారు. ఇకపోతే మొదటివిడత ఎన్నికలకు ఆరురోజులు మాత్రమే ప్రచారం చేసుకునే అవకాశం ఉంది. రెండవ విడత ఎన్నికలకు కూడా అదే సమయం ఉండడం, మూడవ విడతకు కూడా కేవలం ఆరురోజుల ప్రచారం సమయం ఉండడంతో నాయకుల్లో ఓ పక్కా ఆనందం ఉన్నా, మరోపక్క ఓటర్లను మల్చుకోవడానికి ఇంత గడువు ఉండడంతో ఎలా అనే సందేహాలు కూడా వ్యక్తమవుతున్నాయి. ఇక పల్లెల్లో పోరు మొదలైంది. ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కావడంతో గ్రామపంచాయతీ ఎన్నికల కొలాహలం ప్రారంభం అయ్యింది. నేటి నుండే గ్రామాల్లో ఎన్నికల నియమావళి ఆమలులోకి వచ్చింది. సంక్రాంతి పండుగ సమయంలో మొదటి విడత ఎన్నికల ప్రక్రియలో భాగంగా నామినేషన్ల ప్రక్రియ కొనసాగనుంది. అయినప్పటికిని పోలింగ్ 21వ తేది ఉండడంతో సంక్రాంతి పండుగ కూడా ఎన్నికల వాతావరణంలో కొనసాగనుంది. ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో 1672 గ్రామపంచాయతీలకు ఎన్నికలు జరగనున్నాయి. ఇందులో ఈ దఫా ఎన్నికల్లో 836గ్రామపంచాయతీలు మహిళలకు రిజర్వేషన్ కోటాలో వెళ్లిపోయాయి. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా తీసుకువచ్చిన గ్రామపంచాయతీ చట్టంలో అనేక అంశాలను పొందుపర్చడం, అందులో ప్రధానంగా మహిళలకు 50శాతం రిజర్వేషన్లు వందశాతం గిరిజనులు ఉన్న గ్రామాలు కూడా వారికే కేటాయించడం వంటి కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఏది ఎమైనప్పటికిని మూడు విడతల్లో గ్రామపంచాయతీ ఎన్నికలు నిర్వహించడానికి రాష్ట్ర ఎన్నికల కమీషన్ నిర్ణయం తీసుకుంది.
సంబురంగా కొత్త సంవత్సర వేడుకలు
* దేవాలయాల్లో భక్తుల కిటకిట * పార్కుల్లో జనం సందడి

మహబూబ్‌నగర్, జనవరి 1: 2019 నూతన సంవత్సర ప్రారంభోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. జిల్లా వ్యాప్తంగా 2019 నూతన సంవత్సవ వేడుకలు అంబరాన్నంటాయి. ఈ సందర్భంగా మంగళవారం జిల్లా వ్యాప్తంగా ప్రజలు నూతన సంవత్సరం వేడుకలు ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా ఉమ్పడి మహబూబ్‌నగర్ జిల్లాలో జోగులాంబ గద్వాల, నాగర్‌కర్నూల్, వనపర్తి, మహబూబ్‌నగర్ జిల్లాలో ప్రజలు నూతన సంవత్సర వేడుకలను ఎంతో అత్యంత వైభవంగా ఉల్లాసంగా జరుపుకున్నారు. జిల్లాలోని దేవాలయాల్లో భక్తుల రద్ది కనిపించింది. అదేవిధంగా జిల్లాలోని అన్ని పార్కులలో జనం కోలహలం కనిపించింది. ముఖ్యంగా ప్రధాన దేవాలయాల్లో భక్తుల తాకిడి నెలకొంది. జిల్లాలోని ప్రధాన పార్కులైన మయూరి పార్కు, పిల్లలమర్రికి సందర్శలకుల తాకిడి కనిపించింది. జిల్లాలోని ప్రధాన సాగునీటి ప్రాజెక్టు అయినా జూరాల ప్రాజెక్టు దగ్గర సైతం సందర్శకులు సందడి నెలకొంది. ఇకపవతే మయూరి పార్క్‌కు వెల9ది మంది సందర్శకులు తరవలిరావడంతో ఆ ప్రాంతమంతా సందర్శకులతో కిటకిటలాడింది. పిల్లలమర్రికి సందర్శకులు వేలాదిగా తరలిరావడంతో అక్కడ ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. ఇకపోతే మయూరి పార్క్ దగ్గర జనం సందడే సందడి అని చెప్పవచ్చు. మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలో ఈ రెండు పర్యాటక కేంద్రాలు ప్రసిద్ది చెందిన ప్రాంతాలకు జనం పోటెత్తడంతో పోలీసులు సైతం అప్రమత్తం అయ్యారు. జిల్లాలోని ప్రధాన దేవాలయాలు జోగుళాంబా అమ్మవార్శిక్తిపీఠంలో భక్తుల సందడి నెలకొంది. నూతనసంతవత్సరం సందర్భంగా అమ్మవారి ఆశీస్సులు తమకు లభించాలని అమ్మవారిని మొక్కుల ద్వారా కోరుకున్నారు. జిల్లా కేంద్రంలోని రేణుకా ఎల్లమ్మదేవి ఆలయం భక్తులతో కిటకిటలాండింది. మహబూబ్‌నగర్ సమీపంలోని మన్యంకొండ దేవాలయానిక భక్తులు పోటేత్తారు. దాంతో పోలీసులు భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని జాగ్రత్త చర్యలు తీసుకున్నారు. కాటన్ మిల్ శ్రీ వెంకటేశ్వరస్వామి దేవాలయానికి ఉదయం నుండే భక్తుల తాకిడి నెలకొంది. భక్తులు అధిక సంఖ్యలో తరలిరావడంతో దేవాలయ సిబ్బంది అన్ని ఏర్పాట్లు చేశారు. నూతన సంవత్సర వేడుకలను మహబూబ్‌నగర్ పట్టణంలో జిల్లా కలెక్టర్ రోనాల్డ్‌రొస్, ఎమ్మెల్యే శ్రీనివాస్‌గౌడ్, జిల్లా ఎస్పీ రేమారాజేశ్వరి పాల్గొన్ని ప్రజలకు 2019 నూతన సంవత్సర వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. మయూరి పార్క్‌లో జరిగిన వేడుకలు అంబరాన్నంటాయి.
బీసీలకు 34శాతం రిజర్వేషన్లు కొనసాగించాలి
* మాజీ మంత్రి చిత్తరంజన్‌దాసు
కల్వకుర్తి, జనవరి 1: బీసీలను రాజకీయంగా అణగదొక్కడానికే 34 శాతం గల రిజర్వేషన్లను 22 శాతానికి తగ్గించడం జరిగిందని, రిజర్వేషన్లు తగ్గించడంతో బీసీలు రాజ్యాంగం కల్పించిన హక్కులను కోల్పోతారని, 34 శాతం రిజర్వేషన్లను యథావిధిగా కొనసాగించాలని మాజీ మంత్రి చిత్తరంజన్‌దాసు డిమాండ్ చేశారు. మంగళవారం పట్టణంలోని ప్రభుత్వ అథితి గృహంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ బీసీలను రాజకీయంగా అణిచి వేయడానికే రాష్ట్ర ప్రభుత్వం రిజర్వేషన్ల తగ్గింపు చేసేందుకు అర్డినెన్స్‌ను జారీ చేసిందని వెంటనే అట్టి అర్డినెన్స్‌ను రద్దు చేసి 34 శాతవ రిజర్వేషన్లను కొనసాగించాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు. రాష్ట్ర ప్రభుత్వం చొరవ తీసుకుని బీసీలకు అన్యాయం జరగకుండా చూడాలని, బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు రాజ్యాంగం కల్పించిన హక్కు అని ఆయన గుర్తు చేశారు. విలేఖరుల సమావేశంలో అరెకటిక సంక్షేమ సంఘం తాలుకా అధ్యక్షుడు సోమాజీ, బీసీ సబ్ ప్లాన్ సాధన కమిటీ తాలుకా అధ్యక్షుడు రాజేందర్, బీసీ సంక్షేమ సంఘం నాయకులు శశి, జంగయ్య, లక్ష్మయ్య, గోపాల్ తదితరులు ఉన్నారు.