మహబూబ్‌నగర్

నిజమైన కార్యకర్తలే కాంగ్రెస్‌కు అండ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అడ్డాకుల, జూలై 24: అధికార దాహం కోసం వలసదారులు ఉంటారని, నిజమైన కార్యకర్తలే కాంగ్రెస్ పార్టీకి అండగా ఉంటారని ఎమ్మెల్సీ దామోదర్ రెడ్డి అన్నారు. ఆదివారం మండల పరిధిలోని ముసాపేట ఐబి అతిథి గృహంలో ఏర్పాటు చేసిన అడ్డాకుల మండల కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్సీ దామోదర్ రెడ్డి, అలంపూర్ ఎమ్మెల్యే సంపత్ కుమార్, జిల్లా పార్టీ అధ్యక్షులు ఓబేదుల్లా కోత్వాల్, దేవరకద్ర నియోజకవర్గ ఇంఛార్జీ పవన్ కుమార్ రెడ్డిలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ మాట్లాడుతూ తెలంగాణను ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ అని 2019లో తెలంగాణ ప్రజలు కెసి ఆర్‌కు బుద్దిచెపుతున్నట్లు ఆయన జోస్యం చెప్పారు. కాంగ్రెస్ పార్టీలో పని చేసే వారు ప్రలోబాలకు గురి కావ్వొదని, ఎన్ని అంటకాలు ఎదురైనా సైనికుల్లా కాంగ్రెస్ పార్టీని ముందుకు తీసుకెళ్లాలని, జిల్లాలో కార్యకర్తలకు తాను అండగా ఉంటానని ఆయన చెప్పారు. గత ప్రభుత్వాలు ఇచ్చిన నీటిని కెసి ఆర్ ప్రభుత్వం తానే ఇస్తున్నానని గొప్పలు చెప్పుకొని పబ్బం గడుపుతున్నారని ఆయన అన్నారు.
* అమలు కానీ హామీలతో
కెసిఆర్ నాటకాలు
ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టిన హామీలను నెరవేర్చకుండా అమలుకు సాధ్యం కాని కొత్త కొత్త హామీలతో కెసి ఆర్ ప్రజలను ప్రలోభాలకు గురి చేస్తున్నారని అలంపూర్ ఎమ్మెల్యే సంపత్ కుమార్ ఎద్దెవ చేశారు. రైతులకు ఇప్పటి వరకు రుణమాఫీ ఇవ్వలేదని, రైతాంగానికి కెసి ఆర్ మునుముందు కూడా ఏం చేయలేరని ఆయన విమర్శించారు. కష్టపడి ఇళ్లు కట్టుకుంటే సున్నం వేసి బాగుందిలే అనే రకం కెసి ఆర్‌ది అని అన్నారు. కెసి ఆర్ గారడి మాటలతో ప్రజలను మోసం చేస్తున్నారని ప్రజలు తెలుసుకుంటున్నారన్నారు. కర్వెనా ప్రాజెక్టుకు ఎవ్వరు అడ్డుపడుతున్నారోనని కెసి ఆర్ బహిరంగంగా చెప్పాలని, ప్రాజెక్టుతో నష్టపోతున్న రైతులకు ఎక్కువ నష్టపరిహరం ఇచ్చేందుకు కాంగ్రెస్ పార్టీ రైతుల తరపున పోరాటం చేస్తుందని అన్నారు. ఈ సమావేశంలో మండల పార్టీ అధ్యక్షులు బాల నర్సింహులు, కొత్తకోట మండల పార్టీ అధ్యక్షులు విశే్వశ్వర్, నాయకులు జగదీశ్వర్, నాగిరెడ్డి, శెట్టి శేఖర్, నర్సింహులు, కాశీనాథ్, రవి, వెంకటయ్య, శివరాములు తదితరులు పాల్గొన్నారు.