మహబూబ్నగర్
సిఎం బందోబస్తును పర్యవేక్షిస్తున్న డిఐజి
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Thursday, 11 August 2016
పెబ్బేరు, ఆగస్టు11: తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు పుష్కర స్నానాలు ఆచారించేందుకు డిఐజి అకుల్ సబర్వాల్ అలంపూర్ మండలం గొందిమల్ల వెళ్తున్న సందర్భంగా రంగాపూర్ కృష్ణ బ్రిడ్జిపై నడుచుకుంటూ పర్యవేక్షించారు. రంగాపూర్ ఘాట్కు ముందు జాతీయ రహదారిపై తాను వెళ్తున్న వాహనాన్ని నిలిపి కిందికి దిగి రంగాపూర్ ఘాట్ను పైనుండే చూస్తు బ్రిడ్జిపై నడుచుకుంటూ వెళ్లారు. చుట్టు పెద్ద ఎత్తున పోలీసులు మోహరించగా ముఖ్యమంత్రి బీచుపల్లి ఘాట్ వరకు నడుచుకుంటూ వెళ్లారు. రంగాపూర్ నుండి బీచుపల్లి వరకు ప్రత్యేక పోలీసు బృందంతో డిఐజి అకుల్ సబర్వాల్ బందోబస్తును పర్యవేక్షించారు.