మహబూబ్‌నగర్

పుట్టినగడ్డ రుణం తీర్చుకుంటా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వెల్దండ, ఆగస్టు 25: జన్మనిచ్చిన గ్రామాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి పరిచి రుణం తీర్చుకుంటానని కల్వకుర్తి ఎమ్మెల్యే చల్లా వంశీచంద్‌రెడ్డి అన్నారు. గురువారం వెల్దండ మండలం శేరిఅప్పారెడ్డిపల్లి గ్రామంలో ఎసిడిపి నిధులతో నూతనంగా ఏర్పాటు చేసిన బోరు మోటర్‌ను ఎమ్మెల్యే వంశీచంద్‌రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తనకు జన్మనిచ్చిన శేరి అప్పారెడ్డిపల్లి గ్రామంలో ప్రజలకు అవపరమయ్యే వౌలిక సదుపాయలు కల్పించేందుకు శయశక్తుల కృషి చేస్తున్నట్లు తెలిపారు. మండలానికి సుదూరంలో అభివృద్దికి దూరంగా ఉన్న శేరిఅప్పారెడ్డిపల్లి గ్రామంలో అంతర్‌రాష్ట్ర రహదారులు, మురికి కాలువలు, విధిలైట్లు, శివారు గ్రామాలకు రోడ్లను ప్రాధాన్యత క్రమంలో ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. ఎసిడిపి నిధుల్లో రూ.2లక్షలను శేరి అప్పారెడ్డిపల్లి నుండి చంద్రాయన్‌పల్లి గ్రామం వరకు రోడ్డు నిర్మాణానికి నిధులు మంజూరు చేసినట్లు తెలిపారు. గ్రామాభీవృద్ధి కోసం ప్రతి ఒక్కరు పార్టీలకు అతీయితంగా సహకరించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ అలివేల, స్థానిక నాయకులు రామకృష్ణరెడ్డి, ప్రభాకర్‌రెడ్డి, ఉమాసింగ్, మల్లేష్ తదితరులు పాల్గొన్నారు.