మహబూబ్‌నగర్

ఉగ్రవాదుల దిష్టిబొమ్మ దగ్ధం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

షాద్‌నగర్ రూరల్, సెప్టెంబర్ 19: కాశ్మీర్ ఉరీ సైనిక శిబిరంపై ఉగ్రవాదులు దాడి చేయడాన్ని నిరసిస్తూ ఎబివిపి నాయకులు ఉగ్రవాదుల దిష్టిబొమ్మను దగ్దం చేశారు. సోమవారం షాద్‌నగర్ పట్టణంలోని ముఖ్య కూడలిలో ఎబివిపి ఆధ్వర్యంలో ఉగ్రవాదుల దిష్టిబొమ్మను దగ్దం చేశారు. ఈసందర్భంగా ఎబివిపి రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు శరత్‌కుమార్ మాట్లాడుతూ కాశ్మీర్‌లోని ఉరీ సైనిక్ శిబిరంపై జరిగిన ఉగ్రవాదుల దాడిలో మరణించిన 17మంది వీర జవానుల ఆత్మశాంతి కలగాలని కోరారు. ఉగ్రవాదులను పెంచి పోషిస్తున్న పాకిస్తాన్ ద్రోహులను కఠినంగా శిక్షించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎబివిపి పట్టణ కార్యదర్శి ప్రవీణ్‌కుమార్, సురేష్, వినోద్, సూర్యప్రకాష్, విష్ణు, బుజేందర్, శ్రీకాంత్, ప్రసాద్, అశోక్, శివ, సాయి, రాజేష్, శరత్, అభిలాష్, రాకేష్ తదితరులు పాల్గొన్నారు.