మహబూబ్‌నగర్

దేవాలయ నిర్మాణం చేపడుతుండగానే విగ్రహాలు ధ్వంసం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భూత్పూర్, సెప్టెంబర్ 22: దేవాలయం నిర్మాణంలో ఉండగానే గుర్తు తెలియని వ్యక్తులు విగ్రహాలను ధ్వంసం చేసిన సంఘటన మండలంలోని అమిస్తాపూర్‌లో జరిగింది. గ్రామస్ధుల కథనం ప్రకారం మహబూబ్‌నగర్ వెళ్లే రహదారి పక్కన శ్రీ సీతారాముల దేవాలయం నూతనంగా నిర్మాణం చేపడుతున్నారు. బుధవారం రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు రెండు విగ్రహాల చేతులు, గదలను ధ్వంసం చేశారు. గురువారం ఉదయం గ్రామస్ధులు దేవాలయంలోకి వెళ్లి చూడగా విగ్రహాలు ధ్వంసం అయినట్లు గుర్తించారు. నిర్మాణంలో ఉన్న దేవాలయంలో నాలుగు దేవతామూర్తుల విగ్రహాలను దాదాపు రూ.లక్ష రూపాయలతో ఈ విగ్రహాలను ఏర్పాటు చేశారు. దేవాలయం పూర్తి కాకుండానే విగ్రహాలను ధ్వంసం చేయడంతో గ్రామస్ధులు ఆందోళన చెందుతున్నారు. దీంతో గ్రామస్ధులు పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు గ్రామస్ధులు తెలిపారు.