మెదక్

కుమారునితో పాటు తల్లి ఆత్మహత్య

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మిరుదొడ్డి, ఏప్రిల్ 4: కుటుంబ తగదాలతో కుమారునితో పాటు తల్లి బా విలో దూకి ఆత్మహత్య చేసుకున్న సంఘటన మిరుదొడ్డి మండలం చెప్యాల గ్రామంలో సోమవారంనాడు వెలుగులోకి వచ్చింది. గ్రామస్తుల, కుటుంబీకుల కథనం ప్రకారం వివరాలు ఇలా వున్నాయి. గ్రామానికి చెందిన విశాల(28), కు మారుడు చందు(2)ను తీసుకుని ఈనెల 3న ఇంటి నుంచి బయటకు వెళ్లిపోయారు. అదివారంరాత్రి వరకు ఇంటి రాకపోవడంతో చుట్టుప్రక్కల వెతకడం ప్రారంభించారు. సోమవారంనాడు ఇంటి ప్రక్కన వున్న బావిలో చూడగా చం దు శవం నీటిపై తెలడంతో కుటుంబీకులకు సమాచారం అందించారు. అదే వి ధంగా మిరుదొడ్డి పోలిసులకు సైతం సమాచారం అందించారు. పోలిసులు, గ్రామస్తులు బావి వద్దకు వెళ్లి బావిలో వున్న విశాల మృతదేహాన్ని బయటకు తీ శారు. కాగా మృతురాలు పద్మశాలి కులం హైద్రాబాద్‌కు చెందిన విశాల, చె ప్యాల గ్రామం ఎరుకుల కులం చెందిన అనిల్‌ను 6 సంవత్సరాల క్రితం ప్రేమ వివాహం చేసుకుని హైద్రాబాద్‌లో నివాసం వుంటున్నారు.
ఈ క్రమంలోనే మృతురాలు విశాల, భర్త అనిల్ ఇటివలే చెప్యాల గ్రామానికి రావడం జరిగిందని తెలిపారు. ఆర్థిక ఇబ్బందులు, కుటుంబ తగాదాలతోనే ఆత్మహత్య చేసుకోవడం జరిగిందని గ్రామస్తులు తెలిపారు. మిరుదొడ్డి పోలిసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.