మెదక్
తల్లి ప్రియుడిని హతమార్చిన తనయ!
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
రామచంద్రాపురం, డిసెంబర్ 11 : తన తల్లితో చనువుగా ఉంటున్నాడని.. ఆ వ్యక్తినే హత్య చేయించిందో కూతురు. తన స్నేహితులైన ముగ్గురు కుర్రాళ్లతో కాపుకాసి దాడి చేయించింది. తీవ్ర గాయాలపాలైన ఆ వ్యక్తి ఆసుపత్రిలో చనిపోయాడు. ముందు అనుమానాస్పద కేసుగా విచారించిన పోలీసులు అసలు నిందితులను సోమవారం అదుపులోకి తీసుకున్నారు. రామచంద్రాపురం సీఐ భాస్కర్ కేసు వివరాలను విలేఖరుల సమావేశంలో వెల్లడించారు. గంగారానికి చెందిన దుర్గాస్రాద్ (45) స్థానికంగా వ్యాపారం చేస్తూ బిహెచ్ఈఎల్లో నివసిస్తున్నాడు. అయితే భెల్లోనే నివాసముండే ఓ మహిళతో దుర్గాప్రసాద్కు సాన్నిహిత్యం ఉంది. తరచూ కలుస్తుండడంతో అక్రమ సంబంధానికి దారితీసింది. ఆ మహిళ కూతురైన శ్రీజకు ఈ విషయం తెలిసి అతన్ని ఎలాగైనా హత్య చేయాలని పథకం రచించింది. ఎల్ఐజీ కాలనీలో నివాసముండే తన స్నేహితుడైన స్టీఫెన్ ఆంథోనికి విషయం చెప్పింది. దాంతో స్టీఫెన్ ఆంథోని వరంగల్కు చెందిన తన బంధువైన ఆంథోని రెభెల్, శేరిలింగంపల్లి డోయన్స్ కాలనీకి చెందిన శ్రీదీప్ సుందర్ల సహాయంతో ఈనెల 7న బిహెచ్ఈఎల్లో ఇంటికి వెళ్తున్న దుర్గాప్రసాద్ను దారికాచి దాడి చేశారు. కర్రలతో దాడి చేయడంతో తీవ్ర గాయాలపాలైన దుర్గాప్రసాద్ను స్థానికులు కొంతమంది ఆసుపత్రికి తరలించారు. అదేరోజు దుర్గాప్రసాద్ చికిత్స పొందుతూ చనిపోయాడు. ఆయన భార్య ఫిర్యాదు మేరకు రామచంద్రాపురం పోలీసులు అనుమానాస్పద కేసుగా నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించారు. నిందితులు వాడిన ఇన్నోవా కారు నెంబర్ ఆధారంగా సోమవారం ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు. సూత్రదారి శ్రీజ పరారీలో ఉన్నట్లు సీఐ భాస్కర్ తెలిపారు. నింధితులను మీడియా ముందు ప్రవేశపెట్టి రిమాండ్కు తరలించారు.