మెదక్
కాంగ్రెస్ పార్టీలో చేరిన ప్రతి కార్యకర్తనూ కాపాడుకుంటాం
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
సిద్దిపేట, డిసెంబర్ 17 : కాంగ్రెస్ పార్టీలో చేరిన ప్రతి కార్యకర్తను కాపాడుకుంటానని సిద్దిపేట పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు లక్కరసు ప్రభాకర్వర్మ అన్నారు. ఆదివారం సిద్దిపేట 27వ వార్డులో 50 మంది టీఆర్ఎస్ కార్యకర్తలు ప్రభాకర్వర్మ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ నేడు ప్రజలు రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ వైపు మొగ్గు చూపుతున్నారన్నారు. గత వారం రోజుల నుండి వివిధ వార్డులకు చెందిన కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారన్నారు. టీఆర్ఎస్ సర్కార్ ఎన్నికల హామీలను పూర్తిగా విస్మరించిందన్నారు. ప్రజాకంటక పాలన సాగిస్తున్న టీఆర్ఎస్ సర్కార్కు ప్రజలు గుణపాఠం చెప్పే రోజులు దగ్గర్లో ఉన్నాయన్నారు. టీఆర్ఎస్ పార్టీ నచ్చకనే కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీ వైపు మొగ్గు చూపుతున్నారన్నారు. తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన కాంగ్రెస్ పార్టీతోనే అభివృద్ధి సాధ్యమన్నారు. పార్టీలో చేరిన ప్రతి కార్యకర్త సైనికుల్లా పనిచేసి పార్టీ పటిష్టానికి కృషిచేయాలన్నారు. 2019లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావటం ఖాయమన్నారు. రాహుల్గాంధీ నాయకత్వంలో కేంద్రం, రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని ధీమాను వ్యక్తం చేశారు. ఈకార్యక్రమంలో డీసీసీ కార్యదర్శి అత్తుఇమామ్, ఎన్ఎస్యుఐ రాష్ట్ర నాయకుడు దాసరి రాజు తదితరులు పాల్గొన్నారు.