మెదక్

హత్యకు దారితీసిన ఘర్షణ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గజ్వేల్, ఏప్రిల్ 19 : డబ్బుల విషయంలో ఇరువురు తగాదా పడి కొట్టుకోవడంతో ఒకరు మృతి చెందిన సంఘటన వర్గల్ మండలం శేరిపల్లిలో చోటుచేసుకుంది. సంఘటనకు సంబందించి గౌరారం ఎస్‌ఐ మదుసూదన్‌రెడ్డి అందించిన వివరాలిలా ఉన్నాయి. గ్రామానికి చెందిన గంధమల్ల పోచయ్య(62) పశువుల వ్యాపారం చేస్తుంటాడు. అయితే అదే గ్రామానికి చెందిన ప్రభాకర్ బందువుల వద్ద నాలుగు నెలలక్రితం రెండు ఎద్దులు కొనుగోలు చేశాడు. అయితే డబ్బులు చెల్లింపు విషయంలో జాప్యం జరుగగా పోచయ్య, ప్రభాకర్‌ల మధ్య సోమవారం రాత్రి ఘర్షణ చోటుచేసుకొంది. దీంతో తీవ్ర గాయాలబారిన పడిన పోచయ్య అపస్మారక స్థితికి చేరుకోగా ఆసుపత్రికి తరలించే క్రమంలో మృతి చెందాడు. బాదితుల ఫిర్యాదు మేరకు ఎస్‌ఐ మధుసూదన్‌రెడ్డి కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తుండగా మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గజ్వేల్ ఆసుపత్రికి తరలించారు. కాగా నిందితుడు ప్రభాకర్ పోలీసుల అదుపులో ఉన్నట్లు తెలుస్తుంది.