మెదక్

మూడు సెక్షన్ కార్యాలయాలు మంజూరు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సిద్దిపేట,ఏప్రిల్ 20 : సిద్దిపేట నియోజక వర్గానికి మూడు సెక్షన్ ఆఫీసులు మంజూరు అయినట్లు రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి హరీష్‌రావు తెలిపారు. బుధవారం ఆయన టెలిఫోన్‌లో మాట్లాడుతూ సిద్దిపేట మున్సిపాల్టీలో ఆరు గ్రామాలు విలీనం కావటంతో ప్రస్తుతం ఉన్న ఇంజనీర్లలో పనిభారం పెరిగినందున పట్టణంలో టౌన్ - 3 సెక్షన్ కార్యాలయం మంజూరు చేయించినట్లు తెలిపారు. అలాగే రెండు ఎఇ పోస్టులు, సర్కిల్ కార్యాలయానికి రెండు ఎఇ పోస్టులు, స్టోర్‌కు రెండు ఎఇ పోస్టులు మొత్తం ఏడు ఇంజనీర్ పోస్టులు మంజూరు చేయించినట్లు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రైతులకు 9గంటల విద్యుత్ సరఫరా చేయటానికి సిద్దిపేట రూరల్- 2 సెక్షన్ కార్యాలయం మంజూరు చేయించినట్లు తెలిపారు. చిన్నకోడూరు మండలం గుర్రాలగొంది కార్యక్రమానికి ఒక సెక్షన్ కార్యాలయం మంజూరు చేయించినట్లు తెలిపారు. నియోజక వర్గానికి మెరుగైన విద్యుత్ సరఫరా చేసేందుకు కృషిచేయనున్నట్లు తెలిపారు.