మెదక్

డబుల్ బెడ్‌రూమ్ నిర్మాణాలు వేగవంతం చేయండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సంగారెడ్డి టౌన్, మే 21: జిల్లాలో డబుల్ బెడ్‌రూం ఇండ్ల నిర్మాణ పనులను వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ వాసం వెంకటేశ్వర్లు సంబంధిత అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్‌లో వివిధ పనుల పురోగతిపై అధికారులతో సమీక్షించారు. గ్రామాల్లో మరుగుదొడ్ల నిర్మాణాలను వందశాతం పూర్తి చేయాలని, మండలాల వారిగా గ్రామాల్లో పర్యటించి నిర్మాణాలపై ప్రతి వారం ప్రగతి నివేధికలు సమర్పించాలన్నారు. మిషన్ భగీరథ, అర్భన్ మిషన్ కింద గ్రామాల్లో చేపట్టిన అభివృద్ధి పనులు త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. సమావేశంలో జాయింట్ కలెక్టర్ నిఖిల తదిరులు పాల్గొన్నారు.
సిద్దిపేటకు మిషన్ భగీరథ ఎక్సల్లెన్స్ అవార్డు
గజ్వేల్, మే 21: గజ్వేల్‌తోపాటు నియోజకవర్గ పరిధిలోని గ్రామాలు, సిద్దిపేట జిల్లాలో మిషన్‌భగీరథతో దాహార్తి సమస్య పరిష్కరించిన జిల్లా కలెక్టర్ వెంకట్‌రాంరెడ్డి, మిషన్‌భగీరథ ఈఈ రాజయ్యలు సోమవారం హైదరాబాద్‌లో డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి చేతుల మీదు గా మిషన్‌భగీరథ ఎక్సల్లెన్స్ అవార్డును అందుకున్నారు. ఈ కార్యక్రమంలో ఐటీ, మున్సిపల్ శాఖ మంత్రి కె తారకరామారావు, ప్రభుత్వ చీఫ్ సెక్రటరీ ఎస్‌కే జోషి తదితరులు పాల్గొన్నారు.