మెదక్

‘గజ్వేల్‌లో కాంగ్రెస్ జెండా ఎగురవేస్తాం’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గజ్వేల్, మే 26: 2019 అసెంబ్లీ ఎన్నికల్లో గజ్వేల్ నుండి కాంగ్రెస్ అభ్యిర్థిని గెలిపించి తీరుతామని, పార్టీ వీడిన ప్రతి ఒక్కరిని తిరిగి స్వాగతిస్తూ జెండా ఎగురవేస్తామని జిల్లా కాంగ్రెస్ ఎస్సీసెల్ అధ్యక్షులు గాలెంక నర్సింలు, డీసీసీ ఉపాధ్యక్షులు గుంటుకు మల్లేషం, మండల కాంగ్రెస్ అధ్యక్షులు, మాజీ జెడ్‌పీటీసీ నర్సింహాచారిలు స్పష్టం చేశారు. శనివారం గజ్వేల్‌లో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో వారు మాట్లాడారు. ఉమ్మడి మెదక్ జిల్లాలో పార్టీ పటిష్టతకు శ్రమిస్తున్న మాజీ మంత్రి సునితాలక్ష్మారెడ్డిని రెండోసారి అధ్యక్ష బాద్యతలు అప్పగించడం హర్షనీయం కాగా, ఏఐసీసీ చీఫ్ రాహుల్‌గాంధీ, పీసీసీ చీఫ్ ఉత్తంకుమార్‌రెడ్డి, డిప్యూటీ మాజీ సీఎం దామోదర్ రాజనర్సింహలకు కృతజ్ఞతలు తెలిపారు.