మెదక్

గెలుపే లక్ష్యంగా శ్రమించాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గజ్వేల్, జూన్ 21: గజ్వేల్‌లో కాంగ్రెస్ గెలుపే లక్ష్యంగా పార్టీ శ్రేణులు శ్రమించాలని, గ్రూపులు, వర్గాలకతీతంగా పార్టీ పటిష్టతకు కృషి చేసి విజయాన్ని ఏఐసీసీ చీఫ్ రాహుల్‌గాంధీకి బహుమతిగా ఇవ్వాలని తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు ఉత్తంకుమార్‌రెడ్డి పేర్కొన్నారు. ములుగు ఎంపీపీ అధ్యక్షుడు వెంకట్‌రాంరెడ్డి, వర్గల్ మాజీ ఎంపీపీ మోహన్, గజ్వేల్, వర్గల్, ములుగు, జగదేవ్‌పూర్, కొండపాక, తూప్రాన్ మండలాలకు చెందిన పార్టీ బాద్యులు నర్సింహాచారి, నరేందర్‌రెడ్డి, తమ్మలి శ్రీనివాస్, మహేందర్‌రెడ్డి, శ్రీనివాస్‌రెడ్డి, భాస్కర్‌రెడ్డి, జిల్లా ఎస్సీసెల్ కాంగ్రెస్ చైర్మన్ గాలెంక నర్సింలుల బృందం గురువారం పీసీసీ చీఫ్ ఉత్తంకుమార్‌రెడ్డిని కలిసి నియోజకవర్గ సమస్యలు దృష్టికి తెచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గజ్వేల్‌లో రాజకీయ పరిణామాలు వేగంగా దూసుకెల్తుండగా, అందివచ్చిన అవకాశాలు సద్వినియోగం చేసుకుంటూ ముందుకు సాగాలని ఆకాంక్షించారు. అయితే గజ్వేల్‌లో బలమున్న వంటేరు ప్రతాప్‌రెడ్డి కాంగ్రెస్‌లో చేరడం శుభ పరాణామమని, పీసీసీ, డీసీసీ ఆదేశాలను తూచాతప్పకుండా పాటించాలని సూచించారు. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారం చేపట్టడం ఖాయమని, టీఆర్‌ఎస్ నేతల బెదిరింపులు, అక్రమ కేసులకు బయపడవద్దని, ఏ సమస్య తలెత్తినా అధిష్టాన వర్గం దృష్టికి తేవాలని కోరారు. అయితే కష్టపడే కార్యకర్తల కు గౌరవం, గుర్తింపు దక్కుతుందని, పూర్వ వైభవం తేవడమే లక్ష్యంగా పనిచేసి ఏఐసీసీ చీఫ్ రాహుల్ వద్ద మార్కులు పొందాలని వివరించారు. నియోజకవర్గ యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు భానుప్రకాశ్‌రావు, నేతలు రామకృష్ణారెడ్డి, అనీల్‌రెడ్డి, రాజుగౌడ్‌లు కలిసినవారిలో ఉన్నారు.