మెదక్

యోగాతో మానసికోల్లాసం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సంగారెడ్డి టౌన్, జూన్ 21: యోగాతో ఆరోగ్యవంతంగా ఉండడంతో పాటు మానసిక ఉల్లాసం కలుగుతుందని సంగారెడ్డి ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ అన్నారు. ప్రపంచ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకొని పతాంజలి, ఆయుష్ ఆధ్వర్యంలో పట్టణంలోని పీఎస్‌ఆర్ గార్డెన్‌లో ఏర్పాటు చేసిన యోగా వేడుకల్లో ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ పాల్గొని యోగాసానాలు వేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఆరోగ్యంగా ఉంటే ఎదైన సాధించగలమని, ఆరోగ్యానికి కావాల్సిన నియమాలు పాటించాలని సూచించారు. యోగాతో పెరుగుతున్న ఒత్తిళ్లు దూరమవుతాయని, మనస్సుకు ప్రశాంతత దొరుకుతుందన్నారు. ప్రతి ఒక్కరు తమ దినచర్యలో యోగాను చేర్చుకోవాలని కోరారు. ఉదయం 6నుండి 7గంటల వరకు అందరితో కలిసి యోగాసానాలు వేశారు. కార్యక్రమంలో సీడీసీ చైర్మన్ విజయేందర్‌రెడ్డి, పోతిరెడ్డిపల్లి సర్పంచ్ సుమంగళి శేఖర్, ఆయుష్ అధికారులు, పతాంజలి సభ్యులు, విద్యార్థులు, ప్రజలు పాల్గొన్నారు.