క్రైమ్/లీగల్

డివైడర్‌ను ఢీకొన్న కారు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రామాయంపేట, జూలై 23: నిద్రమత్తులో కారులో ప్రయాణిస్తున్న వారు డివైడర్‌ను ఢీకొన్న ఘటనలో ఇద్దరు అక్కడికి అక్కడే మృత్యువాత చెందగా మరొకరి పరిస్థితి విషమంగా ఉంది. ఈసంఘటన సోమవారం తెల్లవారుజామున మెదక్ జిల్లా రామాయంపేట బైపాస్ శివారులోని అడిగాస్ హోటల్ వద్ద చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేటకు చెందిన సందీప్‌శర్మ (28), మంచిర్యాల జిల్లా ఆర్‌కేపురం గ్రామానికి చెందిన సూర్యతేజ (27) కారును అద్దెకు తీసుకొని హైద్రాబాద్ వెళ్తున్నారు. ఈక్రమంలో రామాయంపేట బైపాస్‌లోకి రాగానే నిద్రమత్తులో ఉన్న డ్రైవర్ కారును డివైడర్‌కు ఢీకొట్టాడు. ఈప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న సందీప్‌శర్మ, సూర్యచంద్రలు అక్కడికి అక్కడే మృతి చెందగా డ్రైవర్ మహామూద్ తీవ్రంగా గాయపడ్డారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాలను మార్చురీకి తరలించారు. తీవ్రంగా గాయపడ్డ డ్రైవర్‌ను గాంధీ ఆసుపత్రికి తరలించారు. మృతుల కుటుంబీకుల రోధనలు ప్రభుత్వ ఆసుపత్రి వద్ద మిన్నంటాయి. కుటుంబీకుల ఫిర్యాదుమేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్‌ఐ మహేందర్ తెలిపారు.