క్రైమ్/లీగల్

ఊరకుక్కల దాడిలో 50 గొర్రెల మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చిన్నశంకరంపేట, ఆగస్టు 6: ఊర కుక్కలు గొర్రెల మందపై దాడిచేసిన సంఘటనలో 50 గొర్రెలు మృతిచెందగా మరో 10 గొర్రెల పరిస్థితి విషమంగా ఉన్న సంఘటన ఆదివారం రాత్రి బాగీర్తీపల్లిలో చోటుచేసుకుంది. ఇదే గ్రామానికి చెందిన పక్కడి అంజయ్య, చింతల సత్యం, కుర్మ క్రిష్ణవేణికి చెందిన గొర్రెలను ఇంటిముందు పాకలో ఉంచారు. రాత్రి ఊరకుక్కలు ఒకేసారి పాకలో దూరి గొర్రెలపై దాడి చేయడంతో గొర్రెలు మృతి చెందాయని బాధితులు రోదిస్తూ తెలిపారు. బాధితుల ఫిర్యాదు మేరకు సూరారం వీఆర్‌వో గ్రామానికి చేరుకొని పంచనామా నిర్వహించారు. ఈసంఘటనలో సుమారు 3లక్షల రూపాయల నష్టం జరిగిందని బాధితులు తెలిపారు. వెటర్నరీ అదికారులు నవీన్, ప్రశాంత్‌లు పోస్టుమార్టం నిర్వహించారు. బాధితులకు ప్రభుత్వం నష్టపరిహారం అందించాలని గొర్రెల కాపరి సంఘం డైరెక్టర్ పూలపల్లి యాదగిరి డిమాండ్ చేశారు.