మెదక్

త్వరలో తెల్లాపూర్ రైల్వే అండర్ బ్రిడ్జిని నిర్మిస్తాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రామచంద్రాపురం, ఆగస్టు 14: ఎన్నో ఏళ్లుగా పెండింగ్‌లో ఉన్న తెల్లాపూర్ రైల్వే అండర్ బ్రిడ్జిని త్వరలోనే నిర్మిస్తామని ఎమ్మెల్యే గూడెం మహీపాల్‌రెడ్డి తెలిపారు. రైల్వే అండర్ బ్రిడ్జి నిర్మాణం కోసం మంగళవారం ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి, ఎమ్మెల్యే గూడెం మహీపాల్‌రెడ్డి దక్షిణ మధ్య రైల్వే జీ ఎం వినోద్ కుమార్‌ను హైదరాబాద్‌లో కలిశారు. తెల్లాపూర్ అండర్ బ్రిడ్జి, రెండవ ఫేజ్ ఎంఎంటీ ఎస్‌లో పటాన్‌చెరు వరకు పొడగింపు, నాగులపల్లిలో రైల్వే టర్మినల్ నిర్మాణం తదితర విషయాలపై ఎంపీ, ఎమ్మెల్యేలు జీ ఎంతో చర్చించారు. అనంతరం వాటి ప్రతిపాదనలను జీఎంకు అందజేశారు. ఈ విషయంపై స్థానికంగా ఎమ్మెల్యే మహిపాల్‌రెడ్డి మాట్లాడుతూ తెల్లాపూర్ ఐటీ కారిడార్‌కు చాలా దగ్గరగా ఉండటం వల్ల నిత్యం ప్రజల రాకపోకలు ఇక్కడ ఎక్కువగా ఉన్నాయాన్నారు. రైల్వే అండర్ బ్రిడ్జి లేకపోవడం వల్ల ప్రతి రోజూ వేలాది మంది ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారని అందుకే వీలైనంత త్వరలో బ్రిడ్జిని నిర్మించాలని జీ ఎంకు విన్నవించామన్నారు. నాగులపల్లిలో కొత్తగా నిర్మించనున్న రైల్వే టర్మినల్ పనులు త్వరలో ప్రారంభించనున్నట్లు జీఎం వినోద్‌కుమార్ తెలిపారని అన్నారు.