మెదక్

పొలం వద్ద కరెంట్ షాక్‌తో రైతు మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దౌల్తాబాద్, మే 17 : నారుమడిని పారించడం కోసం పొలం వద్దకు వెళ్ళి విద్యుదాఘాతానికి గురై ఓ రైతు మృతి చెందిన సంఘటన సోమవారం అర్ధరాత్రి మెదక్ జిల్లా దౌల్తాబాద్ మండలం గాజులపల్లి గ్రామంలో చోటుచేసుకున్నది. కుటుంబసభ్యులు, గ్రామస్థులు, పోలీసుల కథనం ప్రకారం వివరాలిలా ఉన్నాయి. గాజులపల్లి గ్రామానికి చెందిన దాడి కనకయ్య (38) తనకున్న వ్యవసాయంతోపాటూ కూలి పనులు చేసుకుంటూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. ఈ క్రమంలో వచ్చే ఖరీఫ్ కోసం నారుమడిని సిద్దం చేయడానికి సోమవారం అర్ధరాత్రి దాటిన తరువాత నారు మడిని పారించడం కోసం గ్రామ సమీపంలోనే ఉన్న తన బోరుబావి వద్దకు వెళ్ళాడు. అక్కడ పైప్‌ను సరిచేస్తుండగా పక్కనే ఉన్న స్టార్టర్ డబ్బవద్ద వైరుకు తాకి విద్యుత్‌షాక్‌కు గురై అక్కడికక్కడే మృతి చెందాడు. బహిర్భూమి కోసం అక్కడికి వచ్చిన ఓ వ్యక్తి ఈ విషయాన్ని గమనించి కుటుంబసభ్యులకు తెలియజేశాడు. ఈ సంఘటనతో బాధిత కుటుంబం వీధిపాలైంది. మృతునికి భార్య లక్ష్మితోపాటూ ఓ కూతురు, కొడుకులున్నారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు దౌల్తాబాద్ ఎస్‌ఐ పరశురాం తెలిపారు.