మెదక్

క్రీడలకు ప్రభుత్వం గుర్తింపు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తూప్రాన్, జూన్ 9 : క్రీడాకారులకు రాష్ట్ర ప్రభుత్వం పోత్సాహానిస్తుందని గఢా అధికారి హన్మంతరావు పేర్కొన్నారు. మండలంలోని మల్కాపూర్ గ్రామంలో మండల స్థాయి క్రికెట్ టోర్నమెంట్‌ను ప్రారంభించిన సందర్బంగా ఆయన మాట్లాడారు. క్రీడాకారులకు గుర్తింపునివ్వడంతోపాటూ సరైన శిక్షణ కేంద్రాలను నెలకొల్పిందని చెప్పారు. క్రీడలతో మనిషి జ్ఞాపకశక్తి పెరుగుతుందని ఎలాంటి వ్యాదులు రావని ఆయన తెలిపారు. ప్రతి ఒక్కరు రోజూ ఒక గంట చొప్పున ఆటలుకానీ వ్యాయామం గానీ చేస్తే ఎలాంటి వ్యాదులు రావన్నారు. గ్రామీణ ప్రాంతాల్లోని క్రీడాకారులను ప్రోత్సహించడంతోపాటూ గుర్తించడానికి ప్రభుత్వం ప్రతి యేడు క్రీడలను నిర్వహిస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపిపి శ్రీనివాస్, ఎంపిడిఒ శ్రీనివాస్‌రావు, సర్పంచ్ స్వామి తదితరులు పాల్గొన్నారు.