మెదక్

మృత్యువులోను వీడని బంధం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రామాయంపేట, జూన్ 9: మృత్యువులోను అన్నా..చెల్లెల బందం వీడలేదు. వేసవి సెలవుల్లో దైవదర్శనం నిమిత్తం బాసర వెళ్లి తిరుగు ప్రయాణంలో ఆటోను బస్సు ఢీకొట్టిన ప్రమాదంలో ఇద్దరు అక్కడికి అక్కడే మృతిచెందారు. రాయిలాపూర్ గ్రామానికి చెందిన తాడెం మంజుల- నర్సింలు కుమారుడు నితీష్ (17), కూతురు రుచిత (14)లు నిజామాబాద్ జిల్లా నవీపేట మండలం ఫకీరాబాద్ వద్ద బుధవారం జరిగిన ఆటో-బస్సు ప్రమాదంలో మృతి చెందగా గురువారం స్వగ్రామం రాయిలాపూర్‌లో అంత్యక్రియలు జరిగాయి. ఉన్న ఇద్దరు పిల్లలు మృతిచెందడంతో ఆకుటుంబంలో విషాదఛాయలు అలుముకున్నాయి. వేలాదిమంది బంధు, మిత్రులు, గ్రామస్థుల మధ్య అంత్యక్రియలు జరిగాయి.