మెదక్

తమ్ముడిని చంపిన అన్న

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సంగారెడ్డి టౌన్, జూన్ 10: మద్యానికి బానిసై జులైయిగా తిరుగుతూ కుటుంబ పరువు తీస్తున్నాడన్న నేపంతో సొంత తమ్మునే్న హత్య చేసిన నిందితున్ని అరెస్టు చేసినట్లు సంగారెడ్డి డిఎస్పీ ఎం.తిరుపతన్న తెలిపారు. శుక్రవారం సంగారెడ్డి రూరల్ పోలీస్ స్టేషన్‌లో విలేఖరుల సమావేశం ఏర్పాటు చేసి వివరాలను వెల్లడించారు. మండల పరిధిలోని కంది గ్రామానికి చెందిన పల్లె కిరణ్, పల్లె శేఖర్ (23)లు సొంత అన్నదములు. కాగా తాగుడుగు బానిసైన శేఖర్ ఇంట్లో ఉన్న బంగారు వస్తువులు, నగదును ఎత్తుకెళ్లి జల్సాలకు పాల్పడేవాడు. ఎన్ని సార్లు మందలించిన వినకపోవడంతో పాటు గొడవకు దిగేవాడన్నారు. ఇంటి పరువు పోతుందన్న కోపంతో శేఖర్‌ను చంపేందుకు అన్న కిరణ్ పథకం పన్నాడు. ఏప్రిల్ 10న రాత్రి తమ్ముడు శేఖర్‌తో కలిసి మద్యం తాగేందుకు ఫ్లాన్ వేశాడు. గ్రామ శివారులోని అవుసోల్లా చెలుకలో ఇద్దరు మద్యం సేవించారు. మద్యం మత్తులో ఉన్న తమ్ముడి చేతులపై అన్న కిరణ్ గ్రానైట్ రాయిని ఎత్తికొట్టి కసితో బీర్ సీసాను పగులగొట్టి గొంతుకోసి హత్య చేశాడు. ఎవ్వరికీ అనుమానం రాకుండా ఇంటికి వెళ్లి నిద్రించాడు. తెల్లవారి అందిరితో కలిసి సంఘటన స్థలంలో రోధించాడు. కేసు నమోదు చేసుకున్న రూరల్ పోలీసులు దర్యాప్తును ప్రారంభించారు. నమ్మదగిన సమాచారంతో అన్న కిరణ్‌ను అదపులోకి తీసుకొని విచారించగా నేరాన్ని ఒప్పుకున్నట్లు తెలిపారు. నేరస్తుడి నుంచి మృతుని ఆధార్‌కార్డు, బట్టలు స్వాధీనం చేసుకొని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించడం జరుగుతుందన్నారు. రూరల్ సిఐ పి.నరేందర్, ఎస్‌ఐ శివలింగం పాల్గొన్నారు.