ఆంధ్రప్రదేశ్
మృతదేహంతో బంధువుల ఆందోళన
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Monday, 22 February 2016
అనంతపురం: పోలీసుల దెబ్బలకు తట్టుకోలేక ఓ నిండు ప్రాణం గాలిలో కలిసిపోయిందని ఆరోపిస్తూ మృతదేహంతో బంధువులు పోలీసు స్టేషన్ వద్ద ఆందోళన ప్రారంభించిన ఘటన అనంతపురం జిల్లా మడకశిరలో సోమవారం చోటుచేసుకుంది. పేకాడుతుండగా 9 మంది వ్యక్తులను పోలీసులు నిన్న అరెస్టు చేశారు. వారిలో లక్ష్మీనారాయణ అనే వ్యక్తి బెయిల్పై విడుదలై ఇంటికి చేరుకున్నాక ఆకస్మికంగా మరణించాడు. పోలీసుల చిత్రహింసకు గురైనందువల్లే లక్ష్మీనారాయణ మరణించాడని బంధువులు ఆరోపిస్తున్నారు. మరో వారం రోజుల్లో కుమార్తె పెళ్లి జరుగునున్న నేపథ్యంలో లక్ష్మీనారాయణ మరణించడం అతడి కుటుంబంలో విషాదం నింపింది.