మెదక్

రహదారి దిగ్బంధం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సంగారెడ్డి టౌన్, జూన్ 24: మల్లన్నసాగర్ ప్రాజెక్టు భూ నిర్వాసితులకు మద్దతుగా జిల్లా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జాతీయ రహదారి (ముంబాయి) హైవేను దిగ్బంధం చేశారు. మాజీ ఉప ముఖ్యమంత్రి దామోదర్ రాజనర్సింహా, మాజీ మంత్రి, జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సునీతాలక్ష్మారెడ్డి, మాజీ ఎమ్మెల్యే తూర్పు జయప్రకాష్‌రెడ్డి (జగ్గారెడ్డి)లు పార్టీ శ్రేణులతో కలిసి జాతీయ రహదారిపై బైఠాయించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. భూ నిర్వాసితులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. సంగారెడ్డి ఐబి అతిధి గృహం నుండి పోతిరెడ్డిపల్లి చౌరస్తా వరకు పార్టీ శ్రేణులు బైక్ ర్యాలీ నిర్వహించారు. సుమారు అరగంట పాటు రహదారిని దగ్బంధం చేయడంతో సుమారు 2కిలో మీటర్ల వరకు ఎక్కడి వాహనాలు అక్కడే నిలిచిపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. రోడ్డు బైఠాయించిన దామోదర్, సునీతాలక్ష్మారెడ్డి, జగ్గారెడ్డిలను పోలీసులు అరెస్టు చేసి రూరల్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ప్రభుత్వం స్పందించకుంటే పోరాటాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు.