మెదక్

బైక్‌లు ఢీకొని ముగ్గురు మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సిద్దిపేట, జూలై 8: ఎదురెదురుగా వస్తున్న రెండు బైక్‌లు ఢీకొనగా ముగ్గురు మృతి చెందిన సంఘటన సిద్దిపేట కోమటిచెరువు బైపాస్ సమీపంలో శుక్రవారం జరిగింది. వన్‌టౌన్ సిఐ సురేందర్‌రెడ్డి కథనం ప్రకారం...దౌల్తాబాద్‌కు చెందిన మహబూబ్ కుటుంబ సభ్యులతో కలిసి సిద్దిపేట సుభాష్‌నగర్‌లోని బంధువుల ఇంటికి వచ్చాడు. టిఎస్ 15ఇఇ 9560నంబరుగల పల్సర్ పై మహబూబ్, సమీర్, రహీంతస్లీం, అఫ్రిన్, ఇర్ఫానా కోమటిచెరువు మినీట్యాంక్‌బంద్‌ను చూసి తిరిగి పోతున్న క్రమంలో ఎన్సాన్‌పల్లికి చెందిన పూస ప్రవీణ్, శ్రీకాంత్‌లు ఏపి 28బివి 9216నంబరుగల బైక్ మీద చెరువులో చేపలు పట్టుకొని తిరిగి పోతున్నారు. బైపాస్‌రోడ్డులో పల్సర్‌మీద ఉన్న మహబూబ్(32), సమీర్(12) అక్కడికక్కడే మృతి చెందారు. బైక్ నడుపుతున్న ప్రవీణ్‌కు , మిగతావారికి తీవ్రగాయాలు కాగా చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ప్రవీణ్‌ను ప్రాథమిక చికిత్స అనంతరం హైద్రాబాద్‌కు తరలిస్తుండగా మార్గమధ్యంలో ప్రవీణ్ మృతి చెందినట్లు తెలిపారు. సంఘటన స్థలాన్ని వన్‌టౌన్ సిఐ సురేందర్‌రెడ్డి, ఎస్‌ఐలు శ్రీనివాస్‌రెడ్డి, ఇంద్రసేనారెడ్డి సందర్శించారు. రోడ్డు పక్కన ఉన్న కంకర కుప్పను పక్కకు తొలగించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సిఐ తెలిపారు.