మెదక్

శ్రీరామచంద్రుడికి క్షీరాభిషేకం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ములుగు, జూలై 12: ఆషాఢి ఉత్సవాల్లో భాగంగా మర్కుక్ పాండురంగ ఆశ్రమంలోని శ్రీ సీతారామచంద్రస్వామి వారికి మంగళవారం ఉదయం పాలాభిషేకం చేశారు. అనంతరం పూలతో పుష్పార్చన చేశారు. ఈ సంబరాన్ని చూడడానికి భక్తులు ఉదయానే్న స్వామివారి ఆలయంలో బారులు తీరారు. ఆలయ పూజారులు వచ్చిన భక్తులకు హారతి ఇచ్చి తీర్ధ ప్రసాదాలను అందజేశారు. అనంతరం అన్నధాన కార్యక్రమం కూడా నిర్వహించారు. ఈ ఆశ్రమానికి రావడానికి చాలా ఇబ్బందిగా ఉన్నందున ప్రభుత్వం స్పందించిన అనంతరం గజ్వేల్, హకింపేట్, జెబిఎస్, సికింద్రాబాద్ స్టేషన్ నుంచి రవాణా సౌఖర్యాలు కల్పించాలని భక్తులు కోరారు.