మెదక్

బాబు మెప్పుకోసం ప్రతాప్ పాకులాట

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సంగారెడ్డి టౌన్, సెప్టెంబర్ 9: మల్లన్నసాగర్ ప్రాజెక్టుపై రాద్దంతం చేస్తూ చంద్రబాబు మెప్పుపొందేందుకు టిడిపి నేత ప్రతాప్‌రెడ్డి పాకులాడుతున్నాడని సంగారెడ్డి ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ విమర్శించారు. తమ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ప్రాజెక్టులను పట్టించుకున్న పాపన పోలేదని, రాష్ట్ర సుభిక్షం కోసం తెరాస ప్రభుత్వం కృషి చేస్తుంటే అడ్డుకునే ప్రయత్నం చేయడం అవివేకమన్నారు. శుక్రవారం సంగారెడ్డిలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ గతంలో టిడిపి, కాంగ్రెస్ పదవులు రాగానే పెదవులు మూతపడ్డ విధంగా ప్రజల సంక్షేమాన్ని విస్మరించారని ఆరోపించారు. ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణకు అన్యాయం జరగడం వల్లే నీరు, నియామకాల కోసం ఉద్యమించి రాష్ట్రాన్ని సాధించుకున్నామన్నారు. సాధించుకున్న రాష్ట్రాన్ని రైతు ఆత్మహత్యలు లేని తెలంగాణగా తీర్చిదిద్దాలంటే ప్రాజెక్టుల నిర్మాణం తప్పనిసరన్నారు. రైతులు కోరుకున్న విధంగా నష్టపరిహారం చెల్లించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. అభివృద్ధికి అడ్డుపడితే సహించేది లేదని హెచ్చరించారు. సమావేశంలో టిఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షులు మురళీయాదవ్, సిడిసి చైర్మన్ విజయేందర్‌రెడ్డి, మండల అధ్యక్షులు చిల్వెరి ప్రభాకర్, నాయకులు రాంరెడ్డి తదితరులు పాల్గొన్నారు.