మెదక్

భవానీమాతకు ప్రత్యేక పూజలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సంగారెడ్డి టౌన్, సెప్టెంబర్ 22: గత మూడు రోజులుగా సంగారెడ్డి భవానీమాత ఆలయంలో కొనసాగుతున్న శత చండీయాగం ముగిసింది. శ్రీ మాధవనంద సరస్వతి స్వామి సమక్షంలో గురువారం పూర్ణాహుతి కార్యక్రమాన్ని నిర్వహించారు. సంగారెడ్డి ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ పూర్ణాహుతిలో పాల్గొని భవానీమాతకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఆలయంలో చండీయాగం చేపట్టడం శుభసూచికమన్నారు. అనంతరం మాధవానంద సరస్వతి స్వామి ఎమ్మెల్యేకు పూలమాల వేసి ఆశీర్వదించారు. భక్తులు పెద్ద సంఖ్యలో తరలి వచ్చి అమ్మవారిని దర్శించుకున్నారు. భక్తులకు తీర్థప్రసాదాలతో పాటు అన్నదానం చేశారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్ పర్సన్ విజయలక్ష్మి, సిడిసి చైర్మన్ విజయేందర్‌రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ కొండల్‌రెడ్డి, టిఆర్‌ఎస్ పట్టణ ప్రధాన కార్యదర్శి నర్సింలు, నాయకులు శ్రీనివాస్, వెంకటేశం, రవి తదితరులు పాల్గొన్నారు.