రాష్ట్రీయం

డ్రైవర్, నలుగురు మెడికోల మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బోల్తాపడిన ప్రైవేటు బస్సు * విజయవాడ వద్ద ఘోర ప్రమాదం
విజయవాడ, మార్చి 14: విజయవాడ నుంచి హైదరాబాద్ బయలుదేరిన ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు గొల్లపల్లి సమీపంలోని సూరాయపాలెం వద్ద బోల్తా పడింది. ఈ దుర్ఘటనలో ఐదుగురు అక్కడికక్కడే మృతి చెందారు. మరో 20 మంది గాయపడ్డారు. సోమవారం రాత్రి 11 గంటలకు విజయవాడ నుంచి బయలుదేరిన ధనుంజయ ట్రావెల్స్ బస్సు 11.30 గంటల సమయంలో ప్రమాదానికి గురైంది. బస్సు ధ్వంసం కాగా, ఆ శిథిలాల్లో చిక్కుకున్న మృతదేహాలను బయటకు లాగారు. తీవ్ర గాయాలపాలైన వారిలో ముగ్గురి పరిస్థితి విషమంగా వుందని పోలీసులు తెలిపారు. మృతుల్లో నలుగురు ఉస్మానియా వైద్య విద్యార్థులని పోలీసులు గుర్తించారు. మృతదేహాలను పోస్టుమార్టం కోసం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. తూర్పుగోదావరి జిల్లా అమలాపురంలో జరిగిన ఓ ఫెస్ట్‌కు హాజరై వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. మృతుల్లో డ్రైవరూ ఉన్నాడు. డ్రైవర్ తాగి బస్సు నడుపుతున్నట్టు తెలిసింది.